రంగారెడ్డి, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా అంతటా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఉద్యోగుల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించడంతోపాటు జాతీయ జెండాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్లో 75 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శనతోపాటు విద్యార్థులు నిర్వహించిన భారీ ర్యాలీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా షాద్నగర్ పట్టణంలోని మినీ స్టేడియం నుంచి పట్టణ పురవీధుల గుండా భారీ జెండాతో సాగిన ర్యాలీలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి, చేవెళ్లలో నిర్వహించిన ర్యాలీల్లో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 15 రోజలపాటు సంబురాలు, దేశభక్తిని పెం పొందించే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. సీఎం ఆదేశాల మేరకు తెలంగాణవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా.. అమరుల త్యాగాలను స్మరిస్తూ వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీల్లో చిన్నారులు, విద్యార్థులు, ప్రజలు, నాయకులు, అధికారులు.. ఇలా సబ్బండ వర్గాల వారు జాతీయ జెండాలను చేత పట్టుకొని ఉత్సాహంగా పాలు పంచుకున్నారన్నారు. కాగా నేడు జిల్లా, మండల కేం ద్రాల్లో జానపద కళాప్రదర్శనలతోపాటు జిల్లావ్యాప్తంగా బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, ఆగస్టు 13: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం వికారాబాద్ జిల్లావ్యాప్తంగా తిరంగా ర్యాలీలను ఘనంగా నిర్వహించారు. అన్ని గ్రామాలు, మండల కేంద్రా లు, మున్సిపాలిటీలతోపాటు జిల్లా కేం ద్రంలో ఈ ర్యాలీలు పెద్ద ఎత్తున జరిగాయి. చిన్నారులు, విద్యార్థులు, ప్రజ లు, నాయకులు, అధికారులు.. ఇలా సబ్బండ వర్గాల వారు జాతీయ జెండాలను చేత పట్టుకొని ఉత్సాహం గా ర్యాలీల్లో పాలు పంచుకున్నారు. దీంతో ప్రతి గ్రామంలోని రోడ్లు మువ్వన్నెల జెండాల రెపరెపలతో కళకళలాడాయి. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డి, పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్రెడ్డి, ఆయా మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్లు, గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తిరంగా ర్యాలీల్లో పాల్గొనడంతో దేశభక్తి వెల్లివిరిసింది.