పెద్దఅంబర్పేట, ఆగస్టు 12: బస్తీ దవాఖానలతో నిరుపేదలకు కూడా మెరుగైన వైద్యం అందుతున్నదని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పల్లెల్లోనూ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న సీఎం కేసీఆర్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ రెండో వార్డు పసుమాములలో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానను ఆయన ప్రారంభించారు. అంతకుముందు రూ.70 లక్షలతో చేపట్టనున్న, పూర్తైన పలు అభివృద్ధి పనులకు చైర్పర్సన్ స్వప్నాచిరంజీవితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి నాలుగు బస్తీ దవాఖానలు, గ్రామీణ ప్రాంతాలకు మూడు దవాఖానలు వచ్చాయన్నారు. దవాఖానలను మంజూరుచేసిన సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు. దవాఖానల్లో వైద్యులు, మందులు అందుబాటులో ఉంటాయన్నారు.
విన్నపాలు.. వెంటనే పరిష్కారాలు
మున్సిపాలిటీలోని రెండో వార్డు శ్రీరామ్నగర్ కాలనీలో సీసీ రోడ్డు శంకుస్థాపన సందర్భంగా పలువురు కాలనీవాసులతోపాటు పలు కాలనీల ప్రజలు ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి సమస్యలను విన్నవించారు. వెంటనే స్పందించిన కిషన్రెడ్డి సంబంధిత అధికారులతో అప్పుడే ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం అనంతరం పలువురు పింఛన్ల గురించి అడుగగా త్వరలోనే వస్తాయని.. అర్హులందరికీ రేషన్కార్డులను కూడా అందజేస్తామన్నారు. దసరా పండుగకు ముందే స్థలం ఉన్న అర్హులకు ఇండ్ల నిర్మాణానికి డబ్బులు అందజేస్తామని ప్రకటించగా.. అక్కడున్న వారంతా చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టారు.
అంతకుముందు వివేకానందుడి విగ్రహం వద్ద జాతీయ జెండాలు పట్టుకుని భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశా రు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి, కమిషనర్ రామాంజులరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు, కౌన్సిలర్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు రోహిణిరెడ్డి, మణెమ్మ, హరిశంకర్ ముదిరాజ్, రమావత్ పరశురాంనాయక్, కోటేశ్వరరావు, కృష్ణారెడ్డి, శ్రీనివాస్గౌడ్, నాయకులు దామోదర్, సత్యనారాయణరెడ్డి, భాస్కర్గౌడ్, చక్రవర్తిగౌడ్, చిరంజీవి, రాము, విజయభాస్కర్రెడ్డి, గోపాల్గౌడ్, నాగార్జున, పవన్ తదితరులు పాల్గొన్నారు.