యాచారం, ఆగస్టు 11: మండలంలో నూతనంగా నిర్మిస్తున్న రెండు రోడ్లను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మీర్ఖాన్పేట-నజ్దిక్సింగారం గ్రామాల మధ్యలో రోడ్డు వెడల్పు కోసం జేసీబీలతో రోడ్డు కు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలు, చెట్ల పొద లు, రాళ్లు రప్పలను తొలగిస్తున్నారు. ప్రస్తుత రోడ్డును 100 ఫీట్లుగా నిర్మించేందుకు పనులను అధికారులు చేపడుతున్నారు. నందివనపర్తి, యాచారం, మేడిపల్లి తదితర గ్రామాల్లో రోడ్డు వెడల్పుకోసం భూమిని సేకరిస్తున్నారు. ప్రభు త్వం గ్రామీణ ప్రాంత లింకు రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేయడంతో మండలంలోని పలు గ్రామాలకు మంచి రోజులు రానున్నాయి. యాచారం నుంచి మొగుళ్లవంపు, నందివనపర్తి, నజ్దిక్సింగారం మీదుగా కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట మైసమ్మ ఆలయం వరకు నాలుగులేన్ల రోడ్డును నిర్మించనున్నారు.
అటు నందివనపర్తి నుంచి మేడిపల్లి మీదుగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీకి ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్డును నాలుగులేన్లుగా విస్తరించేందుకు ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చొరవతో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులను కూడా మంజూరు చేసింది. ప్రస్తుతం రెండు రోడ్లను నాలుగు లేన్లు గా అభివృద్ధి చేసేందుకు రూ.124.5 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం విదితమే. ఇప్పటికే రోడ్ల విస్తరణ కోసం అధికారులు సర్వే చేసి రూట్ మ్యాప్ను సిద్ధం చేయడంతోపాటు మీర్ఖాన్పేట-నజ్దిక్సింగారం గ్రామాల మధ్య పనులను ప్రారంభించగా అవి కొనసాగుతున్నాయి. కాగా మండలంలో ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం నిమ్జ్ హోదాను కల్పించడంతో రోడ్డు పనులు మరింత వేగవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. దీంతో మండలంలో ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని పలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన లింకు రోడ్ల కు మహర్దశ పట్టనున్నది. రోడ్లు నాలుగు లేన్లుగా మారనుండటంతో ప్రజలు, రైతులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.84.5 కోట్లతో 13 కిలోమీటర్లు..
మండలంలోని నాగార్జునసాగర్-శ్రీశైలం ప్రధా న దారులను కలిపే లింకురోడ్డుకు ఒక్కసారిగా మహర్దశ పట్టనున్నది. రూ.124.5 కోట్లతో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మం డల కేంద్రం నుంచి మొగుళ్లవంపు, నందివనపర్తి, నజ్దిక్సింగారం మీదుగా కందుకూరు మం డలంలోని మీర్ఖాన్పేట గ్రామ సమీపంలో ఉన్న మైసమ్మగుడి వరకు రూ.84.5 కోట్లతో 13 కిలోమీటర్లు, నందివనపర్తి నుంచి మేడిపల్లి మీదుగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీని కలుపు తూ రూ.40కోట్లతో 5.7కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డును నిర్మించనున్నారు. ఇప్పటికే రూ.20 లక్షలతో నందివనపర్తి-మేడిపల్లి రోడ్డు నిర్మాణంలో భాగంగా రెండు వంతెనలను నిర్మించారు. రోడ్ల విస్తరణకు ప్రతిఒక్కరూ సహకరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
అభివృద్ధి దిశగా గ్రామాలు..
గ్రామీణ ప్రాంతాలకు చెందిన రోడ్లు అభివృద్ధి చెందితే అక్కడి ప్రాంతాలు త్వరగా వృద్ధిలోకి వ స్తాయి. ఇప్పటికే మేడిపల్లి, మొండిగౌరెల్లి తదితర గ్రామాల్లో పలురకాల పరిశ్రమల ఏర్పాటు కు టీఎస్ఐఐసీ ప్రణాళికలను రచిస్తున్నది. దీం తో ఇక్కడ ఎంతోమందికి ఉపాధి లభించనుండటంతో నిరుద్యోగ సమస్య పరిష్కారం కానున్న ది. దీనికి తోడు రైతుల భూములకు మంచి ధర రానుండటంతో రియల్ వ్యాపారం విస్తరించనుంది. నందివనపర్తి గ్రామంలో ఫార్మా జంక్షన్ను ఏర్పాటు చేయడంతో దాని చుట్టుపక్కల గ్రామాలైన నందివనపర్తి, అయ్యవారిగూడ, నజ్దిక్సింగారం, తులేఖుర్దు, మొగుళ్లవంపు, మల్కీజ్గూడ, మేడిపల్లి, బొల్లిగుట్టతండా, కొమ్మోనిబా వి, కుర్మిద్ద తదితర గ్రామాలు అభివృద్ధికి నోచు కోనున్నాయి. దీంతోపాటుగా నందివనపర్తి గ్రామంలో కొలువుదీరిన నందీశ్వరక్షేత్రం, ఓం కారేశ్వరాలయం, జ్ఞాన సరస్వతీదేవి ఆలయాలు కూడా వృద్ధిలోకి రానున్నాయి. వ్యాపార సంస్థ లు, కళాశాలలు, బడులు విస్తరించనున్నాయి.
గ్రామీణ రోడ్ల అభివృద్ధికి కృషి
నియోజకవర్గంలోని ప్రధాన రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా. యాచారం-మీర్ఖాన్పేట, నందివనపర్తి-మేడిపల్లి రోడ్లను నాలుగులేన్లుగా విస్తరిస్తున్నాం. దీంతో ఈ ప్రాంతాలు అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందనున్నాయి. రూ.124.5 కోట్లతో యాచారం నుంచి నందివనపర్తి గ్రా మం మీదుగా మీర్ఖాన్పేట వరకు, నందివనపర్తి నుంచి మేడిపల్లి మీదుగా ఫార్మాసిటీని కలుపుతూ 100ఫీట్ల వెడల్పుతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. రోడ్ల నిర్మాణానికి భూసేకరణ సాగుతున్నది.
–మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం