కడ్తాల్, ఆగస్టు 11: ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల్ మండలానికి చెందిన వినయ్కి రూ.60 వేలు, చరికొండ గ్రామానికి చెందిన సునీతకి రూ.20 వేలు, ఉమామహేశ్వరికి రూ19 వేలు, వెల్దండ మండలం ఏంజీ తండాకి చెందిన అనితకి రూ.12 వేలు, కల్వకుర్తి మండలానికి చెందిన పర్వతాలుకి రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం హైదరాబాద్లో లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, లక్ష్మయ్యగౌడ్, రమేశ్, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.
ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ
ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. గురువారంమండల కేంద్రంలో అంతారం గ్రామానికి చెందిన నర్సింహులుకు రూ.26 వేలు, ఈగ పద్మమ్మకు రూ. 22 వేలు, నాగరగూడకు చెందిన వడ్డే ఎల్లయ్యకు రూ.40 వేలు, గొల్లురుగూడకు చెందిన కమలాకర్కు రూ.60 వేలు, బోడంపహాడ్కు చెందిన నాగమణికి రూ. 2.50 లక్షలు, యాదయ్యకు రూ. 60 వేలు, పద్మమ్మకు రూ.30 వేల సీఎం సహాయనిధి చెక్కులను జడ్పీటీసీ అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు గంగాపురం కృష్ణారెడ్డి, కుమ్మరి దర్శన్, ఎంపీటీసీలు సరళ, మధుకర్రెడ్డి, ఉప సర్పంచ్ రాజేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు రాంచంద్రారెడ్డి, యాదిరెడ్డి, ఇనాయత్, సురేందర్రెడ్డి, కిట్టుగౌడ్ తదితరులున్నారు.