బొంరాస్పేట, ఆగస్టు 8: దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ సంబురాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహి స్తున్నది. ఇందులో భాగంగా పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం మొదటి రోజు వజ్రోత్సవాల ప్రారంభ సూచకంగా పాఠశాలలకు మామిడి తోరణాలు కట్టారు. మండలంలోని పూర్యానాయక్తండాలో, బాపల్లితండాలలో హెచ్ఎంలు రవీం దర్ గౌడ్, గోపాల్ విద్యార్థులతో కలిసి పాఠశాల గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరించారు. అనంతరం స్వాతంత్య్ర పోరాటం గురించి విద్యార్థులకు వివరిం చారు.
పరిగి మండల పరిధిలో..
పరిగి టౌన్, ఆగస్టు 8 : పరిగి మండల పరిధిలోని నస్కల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠ శాలలో వజ్రోత్సవాలను ఎంఈవో హరిశ్చందర్ ప్రారంభించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి గోపాల్, హెచ్ఎం వెంకట్, పాండు విద్యార్థులు పాల్గొన్నారు.
నవాబుపేట మండలంలో..
నవాబుపేట,ఆగస్టు8: మండల పరిధిలోని 11హైస్కూల్, 26ప్రాథమిక, 5 ప్రాథ మికోన్నత పాఠశాలల్లో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ఆయా పాఠశాలల ఉపా ధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో యెల్ల కొండ గ్రామ పాఠశాల హెచ్ఎం, పులిమామిడి హెచ్ఎం, నరేగూడ, నవాబుపేట ప్రధానో పాధ్యాయులు పాండు, అంజయ్య, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి
మర్పల్లి, ఆగస్టు 8: వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఎంపీడీవో జగ న్నాథ్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం సమావేశం ఏర్పాటు చేశామని, ఈ నెల 22 వరకు 15 రోజులు ఏయే కార్యక్రమాలను నిర్వహించాలని చర్చించామన్నారు. కార్యక్రమంలో ఎస్సై రా జేంద్రప్రసాద్, రెవెన్యూ సిబ్బంది, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు