బొంరాస్పేట, ఆగస్టు 7 : దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సంద ర్భంగా సోమవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించే వజ్రోత్సవ సం బురాలను మండలంలో ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఎంపీపీ హేమీ బాయి పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో వజ్రోత్సవాల నిర్వ హణపై సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రోజువారీగా నిర్వహించే కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు. రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని, గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, మహిళలు, యువకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తాండూరు డీఎల్పీవో శంకర్నాయక్ మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకల్లో రోజువారీగా నిర్వహించే కార్యక్రమాల గురించి కార్యదర్శులకు వివరించి షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు. జాతీ య జెండాలను ప్రతి ఇంటికీ పంపిణీ చేయాలని, వాటిని ఇండ్లపై ఎగురవేసే విషయంలో నిబంధనలను పాటించేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పాండు, ఏపీఎం అంజిలయ్య, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యదర్శులు, సీసీలు పాల్గొన్నారు.
ర్యాలీలు నిర్వహించాలి
మండలంలోని అన్ని గ్రామాల్లో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వ హించాలని ఎంపీపీ లలితా రమేశ్ అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులతో 75 ఏండ్ల స్వతంత్య్ర వేడుకలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 22 వరకు గ్రామాల్లో 75 ఏండ్ల స్వతంత్ర వజ్రోత్సవాలు నిర్వహించాలన్నారు. తొమ్మిదో తేదీన ర్యాలీ లు నిర్వహించి జాతీయ గీతాలాపన చేయాలని, ప్రతి గ్రామంలో 75 సంఖ్య వచ్చేలాగా మొక్కలు నాటాలన్నారు.. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగు రువేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, పంచాయతీ కార్మికులకు సర్పంచుల అధ్యక్షతన సన్మానించాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో జగన్నాథ్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు సొహైల్, ఎంపీవో మహేశ్కుమార్, ఏపీవో అంజిరెడ్డి, ఆయా గ్రామాల సర్పం చులు నూరోద్ధీన్, జైపాల్రెడ్డి, సురేందర్రెడ్డి, ఉమారాణీ గోపాల్రెడ్డి, దేవమ్మ అబ్రహం, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు