షాద్నగర్, ఆగస్టు 7 : రైతు రాజ్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం చౌదరిగూడలో ఏర్పాటుచేసిన డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. గతంలో వానకాలం వచ్చిందంటే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేవి కావని, నేడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. రైతులకు కావాల్సిన అన్ని రకాల విత్తనాలు ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని చెప్పారు. రైతు వేదికల ద్వారా రైతులను సమన్వయపరుస్తూ.. ఆదర్శవంతమైన వ్యవసాయాన్ని నేటి తరం రైతులకు పరిచయం చేస్తున్నారని తెలిపారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు స్వస్తిపలికి, మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా పంటలను సాగుచేయాలని రైతులకు సూచించారు. డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతపరిచి రైతులకు నాణ్యమైన సేవలను అందించాలని కోరారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
చౌదరిగూడ, కొందుర్గు మండలాల పరిధిలోని పలు గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. తూంపల్లి గ్రామానికి చెందిన అల్లం బావయ్యకు రూ.53,500., చింతకుంట తండాకు చెందిన సభావత్ హరికి రూ.60వేలు, ఎల్కగూడ గ్రామానికి చెందిన షాహిన్బేగంకు రూ.60వేలు, లచ్చంపేట గ్రామానికి చెందిన సరళకు రూ.42వేలు, కాలులాబాద్ గ్రామానికి చెందిన రంగమోళ్ల అంతయ్యకు రూ.23వేలు, పద్మారం గ్రామానికి చెందిన ఈడిగి శ్రీదేవికి రూ.28వేలు, వాచ్యాతండాకు చెందిన పాత్లావత్ రవీందర్కు రూ.44వేలు, కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన వడ్ల అశోక్కు రూ.30వేలు, గంగన్నగూడ గ్రామానికి చెందిన బొల్లారం కృష్ణకు రూ.30వేలు, శ్రీరంగపూర్ గ్రామానికి చెందిన బుయ్యని వెంకటయ్యకు రూ.22 వేలు, గంగన్నగూడ గ్రామం గొల్ల శశికళకు రూ.28వేలు, శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన దొరేటి రాజుకు రూ.8,500 చెక్కులను అందజేశారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
క్రికెట్ టోర్నీ ప్రారంభం
కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామంలో సిద్దులూరి శ్యామ్సుందర్రెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడలపై ఈ తరం యువత మరింత ఆసక్తి చూపాలని ఈ సందర్భంగా కోరారు. గ్రామాలు, క్రీడాకారుల మధ్య స్నేహపూర్వక వాతావరణం క్రీడల ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు. అన్నిటికీ మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని క్రీడల ద్వారా పొందవచ్చని అభిప్రాయపడ్డారు. టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించారు. కొంత సమయంపాటు ఎమ్మెల్యే క్రికెట్ ఆడి క్రీడాకారులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, నాయకుడు రవీందర్, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.