బేగంపేట్ జూలై 6: ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం రాంగోపాల్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తెల్లి మల్లిఖార్జున్గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి నివాసంలో నిర్వహించిన బోనం సమర్పణ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్లొన్నారు. బోయిగూడలోని మల్లిఖార్జున్గౌడ్ నివాసం నుంచి జోగిని శ్యామల బోనంతో నృత్యాలు చేస్తూ డప్పు చప్పుళ్లతో మహంకాళి అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ మల్లిఖార్జున్గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తలసాని సాయికిరణ్యాదవ్, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.