పరిగి, జూలై 5: పరిగి నియోజకవర్గంలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం రూ. 100 కోట్లు వెచ్చిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగి లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇంటర్మీడియెట్, పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.7,500కోట్లతో మన ఊరు-మన బడి కింద పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
పరిగి నియోజకవర్గంలోని 130 పాఠశాలల్లో మొదటి విడుతలో వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నాణ్యమైన విద్య అం దించేందుకు గురుకులాలు నెలకొల్పిందని, ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థిపై రూ. 1.25లక్షలు వెచ్చిస్తుందన్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ద్వారా ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరుగుతున్నాయన్నారు. గతంలో పదవ తరగతిలో 10 జీపీఏ పాయింట్లు కేవలం కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకే వచ్చేవని, నేడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వం విదేశాలలో విద్య కోసం సైతం ఒక్కొక్కరికి రూ.20లక్షలు ఇస్తున్నదని, తాను నలుగురికి ఈ పథకం ద్వారా రూ.80లక్షలు ఇప్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, దోమ, పరిగి జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, బి.హరి ప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మం డలాల రైతుబంధు సమితి అధ్యక్షులు మేడిద రాజేందర్, పీరంపల్లి రాజు, మండల టీఆర్ ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, కౌన్సిలర్లు వేముల కిరణ్, మునీర్, వెంకటేశ్, నాగేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు మౌలానా, రవికుమార్, ఎంఈవో హరిశ్చందర్, విద్యార్థులు పాల్గొన్నారు.