దోమ, జూన్27: జీవ ఎరువుల వాడకంపై రైతులకు అవగా హన కల్పించినట్లు మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రావు సోమవారం తెలిపారు. మండల పరిధిలోని దోమ, శివారెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి తండా తదితర గ్రామాల్లో భాస్వ రాన్ని కరిగించే సూక్ష్మజీవుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వాటి వినియోగంపై రైతుల పొలాల దగ్గర అవ గహన కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు బాబ్యానాయక్, కావ్య, దుర్గాప్రసన్న, ఆగ్రోస్ ఫెర్టిలైజర్ నిర్వహకుడు బాలరాజు పాల్గొన్నారు.