షాద్నగర్టౌన్, జూన్ 27: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్ గ్రామం లో ఎస్సీ కమ్యూనిటీహాల్, సీసీరోడ్డు, మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సోమవారం సర్పంచ్ శ్రీశైలం, ఎంపీపీ శివరాజ్తో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు మరింత సుందరంగా మారాయన్నారు. గ్రామాల అభివృద్ధితో పాటు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందన్నారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్కు సీడీపీ నిధులు రూ. 15 లక్షలు, సీసీరోడ్డుకు ఎస్డీఎఫ్ నిధులు రూ.9 లక్షలు, మహిళా సమాఖ్య భవనానికి డీఎంఎఫ్ నిధులు రూ.15 లక్షలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, మండలాధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, నాయకులు కట్టా వెంకటేశ్గౌడ్, బాబు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
షాద్నగర్ మున్సిపాలిటీలోని పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అందజేశారు. పట్టణంలోని వెంకటరమణ కాలనీ చెందిన జంగయ్యకు రూ.60 వేలు, యాదయ్యకు రూ.38 వేలు, మల్లికార్జున కాలనీ చెందిన మణిదీప్కు రూ. 60 వేలు, ఫరూఖ్నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మల్లయ్యకు రూ.60 వేల చెక్కులను అందజేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు
షాద్నగర్రూరల్ : దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని కొండన్నగూడ గ్రామానికి చెందిన బ్యాగరి బాల్రాజుకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్ను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన వారందరూ దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం, మండలాధ్యక్షుడు పాపయ్య, నాయకులు పాపయ్య, రాఘవేందర్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన వీరన్నపేట నాయకులు
కొందుర్గు : జిల్లెడు చౌదరిగూడ మండలంలోని వీరన్నపేట గ్రామానికి చెందిన ఆయా పార్టీల నాయకులు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, యాదయ్య, అనంద్, బురాన్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
నందిగామ : అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో సర్పంచ్ జిల్లెల్ల వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.30 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో జడ్పీ వైస్చైర్మన్ గణేశ్తో కలిసి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచ్లు గోవిందు అశోక్, రమేశ్గౌడ్, స్వామి, ఉపసర్పంచ్ కుమార్గౌడ్, ఎంపీటీసీ చంద్రపాల్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు దార సురేశ్, రాంబాబు, రవి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు లింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
నందిగామ మండలం పిట్టలగూడ గ్రామానికి చెందిన గంగిశెట్టి లావణ్యకు రూ.23 వేలు, కుమార్కు రూ.14 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లబ్ధిదారులకు అందజేశారు.