ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 26: ప్రభుత్వం ఉన్నత ఆశయంతో మూగజీవాలకు అత్యవసర చికిత్సలు అందించేందుకు పశు వైద్య సం చార వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సత్వర సేవలను అందించేందుకు 1962 నంబర్తో వాహనాలను ప్రతి నియోజకవర్గానికీ ఒక్కటి చొప్పున సర్కారు కేటాయించింది. ఈ వాహనాల్లోని సిబ్బంది మారుమూల గ్రామాల్లోని మూగజీవాలకు వ్యవసాయ క్షేత్రాల వద్దకే వెళ్లి వైద్యం అందించనున్నారు. రైతులు 1962 నంబర్కు ఫోన్ చేసిన క్షణాల్లోనే సిబ్బంది వాహనంతో అక్కడికి వెళ్లి వైద్యసేవలను అందిస్తుండటంతో గ్రామీణ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
19వేల మూగజీవాలకు వైద్యం
గడిచిన ఆరు నెలల్లో రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఐదు పశుసంచార వాహనాల ద్వారా సుమారు 19 వేల మూగజీవాలకు 1962 వాహన సిబ్బంది చికిత్సలు అందించిన ట్లు జిల్లా అధికారి రమేశ్ తెలిపారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని మారుమూల గ్రామాల్లో ప్రమాదాల్లో ఉన్న మూగజీవాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు అత్యవసర వైద్యం అందించి కాపాడినట్లు ఆయన తెలిపారు.
మూగజీవాలకు మెరుగైన వైద్యం
గడిచిన ఆరు నెలల్లో రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఐదు పశుసంచార వాహనాల ద్వారా 19 వేల మూగజీవాలకు మెరుగైన వైద్యాన్ని అం దించడం జరిగింది. తమకు ఫోన్ వచ్చిన వెంటనే ఘటనాస్థలికి 1962 వాహనం ద్వారా తమ సిబ్బంది అక్కడికి చేరుకుని చికిత్సలు అందిస్తున్నారు. ఆ వాహనాల్లో అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
– రమేశ్, పశుసంచార వాహనాల జిల్లా అధికారి