మొయినాబాద్ మండలంలో పర్యటన.. చిలుకూరులో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ప్రారంభం
మొయినాబాద్, జూన్ 25: మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శనివారం మొయినాబాద్ మండలంలో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలుకూరులో రూ.2.60 కోట్ల నిధులతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో నిరాదరణకు గురైన మహిళా ప్రాంగణాలను వినియోగంలోకి తెచ్చి మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త గ్రామపంచాయతీలు, జిల్లాలు ఏర్పాటు చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసిందని మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆమె మండలంలోని హిమాయత్నగర్ రెవెన్యూలోని అజీజ్నగర్ గ్రామానికి వెళ్లే సీసీ రోడ్డు నిర్మాణ పను లకు శంకుస్థాపన చేశారు. అనంతరం చిలుకూ రు గ్రామ రెవెన్యూలో ఉన్న జిల్లా మహిళా ప్రాం గణంలో రూ.2.60 కోట్లతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనాన్ని రంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, సర్పంచ్ స్వరూపతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో నిరాదరణ కు గురైనటువంటి మహిళా ప్రాంగణాలను వెలుగులోకి తీసుకొచ్చి మహిళలకు ఉచితంగా స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదన్నారు.
మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభు త్వం ఉచితంగా శిక్షణ ఇస్తూ వారికి కుట్టుమిషన్లను అందిస్తున్నట్లు తెలిపారు. అన్ని మహిళా ప్రాంగణాల్లోని ఉమెన్స్ వర్కింగ్ హాస్టళ్లు, చిల్డ్రె న్ హోమ్స్, శిశువిహార్లు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పరిపాలనను ప్రజలకు చేరువలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో కొత్తగా 23 జిల్లాల ను ఏర్పాటు చేశారన్నారు. మొత్తంగా 33 జిల్లా లు ఉన్నట్లు తెలిపారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు ప్ర భుత్వం ప్రత్యేకంగా రిజర్వేషన్లను కల్పించినట్లు , పరిపాలనాసౌలభ్యం కోసం కొత్త గ్రామపంచా యతీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిలుకూరులో నూతనంగా నిర్మించిన ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్లో 150 మంది వసతి పొందొచ్చన్నారు. రాష్ట్రంలో అభివృద్ధితోపాటు అనేక రకాల సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు జరుగుతున్నాయన్నారు.
కార్యక్రమంలో హిమాయత్నగర్ సర్పంచ్ మంజుల, అజీజ్నగర్ సర్పంచ్ సంధ్య, వైస్ ఎంపీపీ మమత, ఉపసర్పంచ్ శ్యాంరావు, జిల్లా పరిషత్ మహిళా, శిశు, సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ విశాల, జిల్లా మహిళా సహకార అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సబిత, మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ శైలకుమారి, ఐసీడీఎస్ పీడీ మోతీ, ఎంపీటీసీ సుజాత, ఆర్డీవో వేణుమాధవ్, తహసీల్దార్ అశోక్కుమార్, ఎంపీడీవో సంధ్య, ఏవో రాగమ్మ, పీఆర్ డీఈ విజయ్కుమార్, సీడీపీవో శోభ, సర్పంచ్లు శ్రీనివాస్,మనోజ్కుమార్, కార్యదర్శి దీపాలత, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజు, మాజీ జడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొత్త నర్సింహారెడ్డి, మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ మాణిక్రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లేశ్, టీఆర్ఎస్ నాయకులు రవియాదవ్, శ్రీశైలం, వెంకటేశ్, పరమేశ్, కిరణ్, జగన్, మాణిక్యం, మల్లారెడ్డి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.