పరిగి, జూన్ 25: గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలంగాణ సర్కార్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నది. ఇప్పటికే పల్లె ప్రగతితో గ్రామాల్లో సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించింది. దీంతో ఇటీవల జాతీయ స్థాయిలో స్వచ్ఛతలో 20 ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తే అందులో 19 గ్రామాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి. ఇదే స్ఫూర్తితో వికారాబాద్ జిల్లాలోనూ పలు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా జిల్ల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. మండలానికి నాలుగు గ్రామాల చొప్పున ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. మొదటగా పూడూరు మండలం మీర్జాపూర్ను మోడల్గా తీర్చిదిద్దేందుకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నడుం బిగించారు. ఎంపికైన నాలుగు గ్రామాలను ఎంపీడీవో, ఎంపీవో, ఉపాధిహామీ ఈసీ, ఏపీవోలు ఒక్కొక్కటి చొప్పున దత్తత తీసుకొని వసతుల కల్పన, ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం, పచ్చదనం, పరిశుభ్రత పెంపునకు చర్యలు తీసుకోనున్నారు. నెల రోజుల్లో వందశాతం పనులు పూర్తి చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 19 మండలాలు ఉన్నాయి.
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామా ల స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. అన్ని గ్రామాల్లో అన్ని రకాల వసతులను వంద శాతం పూర్తి చేయించి మరింత ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు వికారాబాద్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో కృషి చేస్తున్నారు. కలెక్టర్ నిఖిల ఆదేశాల మేరకు జిల్లాలోని 19 మండలాల్లో ప్రతి మండలంలోని నాలుగు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. మొదటగా పూడూరు మండలంలోని మీర్జాపూర్ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు నడుం బిగించారు. దీంతోపాటు ప్రతి మండలంలో నాలుగు గ్రామపంచాయతీలను ఎంపిక చేసి నెల రోజుల్లో ప్ర భుత్వ కార్యక్రమాలను పక్కాగా అమలు చేసి ఇతర గ్రామాలకు ఆదర్శంగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం ఇప్పటికే గ్రామాల ఎంపిక కూడా పూర్తైంది.
ప్రతి మండలంలో నాలుగు గ్రామాలు
జిల్లాలోని 19 మండలాల్లో ప్రతి మండలంలోని నాలుగు గ్రామాలను ఎంపిక చేసి అన్ని వసతులు, పచ్చదనం, పరిశుభ్రత వంటి తదితర కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన నాలుగు గ్రామాలను ఎంపీడీవో, ఎంపీవో, ఉపాధిహామీ ఈసీ, ఏపీవో ఒక్కొక్క గ్రామం చొప్పు న నలుగురు అధికారులు దత్తత తీసుకుని గ్రామాల అభ్యున్నతికి చర్యలు చేపడుతారు. ఎంపీడీవో, ఎం పీవో ఒక్కరే ఉన్నచోట మండలంలో మూడు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దనున్నారు. స్వచ్ఛతలో జాతీయ స్థాయిలో 20 గ్రామాలను ఎంపిక చేస్తే 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపికైన సందర్భంలో వికారాబాద్ జిల్లాలోని అన్ని గ్రా మాలను ఆదర్శ గ్రామాలు రూపొందించాలని లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. కాగా పూడూ రు మండలంలోని మీర్జాపూర్ గ్రామాన్ని డీఆర్డీవో కృష్ణన్ స్వయంగా దగ్గరుండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
జిల్లాలోని ప్రతి మండలంలో నాలుగు గ్రామాలను ఎంపిక చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దనున్నాం. కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే గ్రామాల కూడా పూర్తైంది. ఎంపీడీ వో, ఎంపీవో, ఉపాధి హామీ ఈసీ, ఏపీవోలు ఒక్కో గ్రామం చొప్పున గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుంటారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారు. అవెన్యూ ప్లాంటేషన్, ఇంకుడుగుంతలు, క్రీడా ప్రాంగణాలు, పారిశుధ్య కార్యక్రమా లు, వర్మీ కంపోస్టు తయారీ తదితర అన్ని విషయాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. -కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా