మొయినాబాద్, జూన్ 19 : ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడానికి సైనికుల్లా పని చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని బాకారం గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 10 మంది కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వాలు అందించిన పరిపాలన, ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పరిపాలన మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పేద ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేయడంతో పాటు అనేక అభివృద్ధి పనులు చేస్తున్నదని వివరించారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బద్దుల సుధాకర్యాదవ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సిరిగిరి నర్సింహ, కొండకల్ల మహేందర్, మాల రాజు, పి శేఖర్, నర్సింహులు, శ్రీకాంత్, ప్రవీణ్గౌడ్, భానుప్రతాప్, కొండకల్ల ప్రవీణ్, శ్రీనివాస్, ఎస్ రాములు తదితరులు పాల్గొన్నారు.