కొందుర్గు, మే 28 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం కొందుర్గు మండలంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పర్యటించి ఆయా గ్రామాలకు విడుదలైన నిధులను ప్రకటించా రు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అభివృద్ధి పనుల నిధులను ప్రజలకు వివరించి శంకుస్థాపన చేశారు. రైతుబీమా, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, మహిళలకు స్త్రీనిధి రుణాల చెక్కులను అందజేశారు. కొందుర్గు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన నలుగురికి దళితబంధు పథ కం ద్వారా విడుదలైన చెక్కులను అందజేశారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించారు.
రేగడి చిల్కమర్రి పాఠశాలకు రూ. 16 లక్ష లు, ముట్పూర్ పాఠశాలకు రూ.11.15 లక్షలు, టేకులపల్లి పాఠశాలకు రూ. 4.75 లక్షలు, ఉత్తరాశిపల్లి పాఠశాలకు రూ.3.62 లక్షలు, కొందుర్గు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.37. 22 లక్షలు, కొందుర్గు బాలికల పాఠశాలకు రూ.14.78 లక్షలు, కొందుర్గు ప్రాథమిక పాఠశాలకు రూ.6.11 లక్షలు, తంగెళ్లపల్లి పాఠశాలకు రూ. 34.92 లక్ష లు, ఉత్తరాశిపల్లి పాఠశాలకు రూ. 9.09 లక్షలు, విశ్వనాథ్పూర్ పాఠశాలకు రూ. 4.86 లక్షలు, ఆగిర్యాల పాఠశాలకు రూ.37. 22 లక్షలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. అనంతరం తంగెళ్లపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్యకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు రూ. 68 వేలు, సత్యనారాయణ కు రూ. 30 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగయ్య, జడ్పీటీసీ రాగమ్మ, ఎంపీడీవో ఆంజనేయులు, వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.