పరిగి, మే 12 : వరి పండించిన ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. గురువారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో పరిగి మం డలం సుల్తాన్పూర్, రంగంపల్లి గ్రామాల్లో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఇబ్బంది పడకుండా ఉం డేందుకు ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా భరించేందుకు సిద్ధమై, రైతులకు మేలు కలగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రభు త్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలుకు నిర్ణయించారని అన్నారు. రైతులు తమ వరి ధా న్యం బయట విక్రయించరాదని, కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే సూచించారు.
ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు అందజేయడం, పుష్కలంగా నీరు ఉండడంతో పంటల సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు దిగుబడులు పెరిగాయని అన్నారు. తద్వారా గతంతో పోలిస్తే అధికంగా వరి ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమానికే పెద్ద పీట వేస్తూ ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందన్నా రు. రైతులు పంటలు సాగు చేయడం దగ్గర నుంచి పండించిన పంటలు కొనుగోలు వరకు అడుగడుగునా ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యానికి సైతం సకాలంలో డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ద్వారా పారదర్శకంగా కొనుగోలు జరుపుతుందని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, రంగంపల్లి సర్పంచ్ లక్ష్మీదేవి, మండల ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు కె.వెంకట్రాంరెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ పి.వెంకట్రాంరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ హన్మంత్రెడ్డి పాల్గొన్నారు.