షాబాద్, జూలై 21 : మండలంలో బక్రీద్ను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. బుధవారం మండలంలోని పోతుగల్, షాబాద్, హైతాబాద్, బోడంపహాడ్, సోలిపేట్, మన్మర్రి, అంతారం, బొబ్బిలిగామ తదితర గ్రామాల్లో ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండల కేంద్రంలో ముస్లిం సోదరులకు జడ్పీటీసీ అవినాశ్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు ఎంఏ మతీన్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
షాద్నగర్టౌన్, జూలై 21: ఉదయం నుంచే ముసురు కురవడంతో ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ సమాజంలోని మానవులందరూ సమానమనే విషయాన్ని సూచిస్తుందని మత పెద్దలు తెలిపారు.
షాద్నగర్ రూరల్లో..
షాద్నగర్ రూరల్, జూలై 21 : ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లోని మైనార్టీలు బక్రీద్ నిర్వహించుకున్నారు. చాలా వరకు ఇండ్లల్లోనే ప్రార్థనలు చేశారు.
కొత్తూరు రూరల్లో..
కొత్తూరు రూరల్, జూలై 21: త్యాగానికి ప్రతీక బక్రీద్ అని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్నర్వ, పెంజర్ల, కొడిచర్ల, సిద్దాపూర్, గూడూరు, తీగాపూర్, మల్లాపూర్ గ్రామాల్లో మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో బక్రీద్ను ఘనంగా నిర్వహించారు. జేపీదర్గాలోని మసీదులో ప్రార్థనలకు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి హాజరై శుభాకాంక్షలను తెలియజేశారు.
కొత్తూరులో..
కొత్తూరు, జూలై 21 : కొత్తూరులోని ఈద్గా వద్ద టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్ యాదవ్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీ యాదయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇస్మాయిల్ఖాన్ పాల్గొన్నారు.