కొత్తూరు, డిసెంబర్ 19 : రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఎస్బీపల్లి నుంచి కేశంపేట మండల్ కొత్తపేట వరుకు రూ. 20 కోట్ల సీఆర్ఎఫ్ నిధులతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులకుసోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం జడ్పీటీసీ ఎమ్మెల శ్రీలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రోడ్డు వల్ల కడ్తాల్, ఆమనగల్లు, శ్రీశైలం లాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు సులువవుతుందని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్రెడ్డి, ఆర్అండ్బీ డీఈఈ రవీంద్రకుమార్, ఎంపీడీవో శరత్చంద్రబాబు, ఎంపీవో నర్సింహులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్, సర్పంచ్లు, వడ్డె తులసమ్మ, బ్యాగరి సత్తయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పద్మారావు, నాయకులు పెంటనోళ్ల యాదగిరి, లింగం నాయక్, ఉస పర్పంచ్ శ్రీరాములు పాల్గొన్నారు.
అర్హులకే సంక్షేమ ఫలాలు అందాలి
కేశంపేట : అర్హులైన నిరుపేదలకే తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. కేశంపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలతో ప్రభుత్వం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదన్నారు. గ్రామాల అభివృద్ధ్దికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అభివృద్ధ్దికి కృషి చేయాలని సూచించారు. వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిచాలని సూచించారు. అనంతరం క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా తోఫా దుస్తులు, లబ్ధ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. మండల మహిళా సమాఖ్యలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వీల్చైర్స్, వైట్ కేన్స్, వినికిడి యంత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ విశాల, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, తహసీల్దార్ ఆజం అలీ, ఇన్చార్జి ఎంపీడీవో రవిచంద్రకుమార్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిర్దవెళ్లిలో..
మండలంలోని నిర్దవెళ్లిలో 20 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించతలపెట్టిన షాదీఖాన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం గ్రామ పరిధిలోని శ్యాంరావుతండాలో రూ. 5 లక్షల తో నిర్మించనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ విశాల, బీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ పల్లెనర్సింగ్రావు, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.