నందిగామ, డిసెంబర్ 17 : ధ్యానంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుఖ్ మాండనీయ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో శ్రీరామచంద్రమిషన్లో హార్ట్ఫుల్నెస్ ధ్యాన గురువు కమలేశ్ డీ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఇంటిగ్రేటివ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్(ఐహెచ్డబ్ల్యూ) సదస్సుకు శనివారం మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ధ్యాన కేంద్రంలో ధ్యానం చేశారు. ధ్యాన గురువు కమలేశ్ డీ పటేల్ రచించిన ‘విజ్డమ్ బ్రిడ్జ్’ పుస్తకాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 1.5లక్షల వెల్నెస్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో భారత్ అయుష్ మంత్రిత్వశాఖ గౌరవ కార్యదర్శి రాజేష్ కోహెచా, యూనివర్సిటీ చాన్స్లర్ జయరామ్, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, ప్రముఖులు అనుప్ థాకర్, సాధ్వీ భగవతి సరస్వతి, సత్ బిర్ ఖల్ఫా, సారా లాజర్, రోలిన్ మెక్రాటీ పాల్గొన్నారు.