షాబాద్, డిసెంబర్ 17: పిల్లలు క్రమం తప్పకుండా ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మండల విద్యాధికారి శంకర్రాథోడ్ అన్నారు. శనివారం షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్-టీచర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తున్నామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, విలువలను అలవర్చుకోవాలని సూచించారు. సమావేశంలో హెచ్ఎం కె. శ్రీనివాస్, మండల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఆయూబ్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అంజయ్య, విద్యాకమిటీ చైర్మన్ షబ్బీర్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శ్రీనివాస్, ఉపాధ్యాయులు సరిత, రవీందర్, చంద్రశేఖర్, విఠలయ్య, జంగారెడ్డి పాల్గొన్నారు.
ఆదిబట్ల : ప్రభుత్వ పాఠశాలలలోనే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఏర్పడుతుందని ఆదిబట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వర్కాల పరమేశ్ అన్నారు. శనివారం ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.