బషీరాబాద్, డిసెంబర్ 11 : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి చొరవతో మా ఊరికి బస్సు వచ్చిందని కర్ణాటక రాష్ట్రం, సేడం తాలూకా, మదికల్ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం తాండూరు డిపో నుంచి బషీరాబాద్ కర్ణాటక రాష్ట్రం ఐయ్యాలం, కురుగుంట, మదికల్ గ్రామాల మీదుగా సేడం తాలూకాకు బస్ సర్వీస్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సుకు పూజలు చేసి, డ్రైవర్, కండక్టర్ను సన్మానించారు. పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మండలంలో ఆయా గ్రామాల్లో పర్యటిస్తుండగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు, ఎక్మాయి గ్రామంలో పర్యటన విషయం తెలుసుకుని ఎమ్మెల్యేను కలిసి మా గ్రామాల ప్రజలు తెలంగాణ రాష్ర్టానికి ఉపాధి కోసం వస్తుంటారు మా ఊరికి తాండూరు డిపో నుంచి బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా, తక్షణమే ఎమ్మెల్యే తాండూరు డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించాలని తెలిపారు. దీంతో ఆదివారం ఉదయం 9:30 గంటలకు తాండూరు డిపో నుంచి మండల కేంద్రం మీదుగా కర్ణాటక రాష్ర్టాల గ్రామాల మీదుగా సేడంకు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేసి ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.