పరిగి, డిసెంబర్ 10: ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని… ఆ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. త్వరలోనే వందమంది ఓటర్లకు ఒక ఇన్చార్జినీ నియమిస్తామన్నారు. శనివారం మండలంలోని లఖ్నాపూర్ గ్రా మంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వాటిని ప్రజలకు వివరించాల్సి న బాధ్యత నాయకులపై ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభు త్వం 60 లక్షల మందికి రైతుబంధును ఇస్తుండగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 15 లక్షల మందికి కూడా పీఎం కిసాన్ నిధులు ఇవ్వడంలేదని విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభు త్వం నెరవేరుస్తున్నదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగిందని, రైతుబంధు ద్వారా ఒక్కో సీజన్లో రూ.27 కోట్లు పరిగి మండల రైతులకు ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ప్రతినెలా రూ.కోటీ 54 లక్షలు పింఛన్గా అందుతుండగా.. కల్యాణలక్ష్మి కింద 500 మందికి సహాయం అందిందన్నారు. ఇలాంటి ప్రభుత్వ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నా రు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, ఎంపీపీ కరణం అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ సు రేందర్, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజేందర్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ప్రవీణ్కుమార్రెడ్డి, ఎం పీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ల సం ఘం జిల్లా అధ్యక్షుడు అశోక్వర్ధ్దన్రెడ్డి, ఎంపీటీసీ పర్శవేది, చిగురాల్పల్లి సర్పంచ్ వెంకటయ్య ఉన్నారు.