చేవెళ్లటౌన్, నవంబర్ 27 : కురుమలు ఐక్యంగా ఉండాలని కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిష్ణగోని సదానందం అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కేసీఆర్ గార్డెన్లో సదానందం సమక్షంలో చేవెళ్ల మండల కురుమ సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కసిరె వెంకటేష్, ఉపాధ్యక్షులుగా దండు సత్యనారాయణ, ఎర్ర మల్లేశ్, సాయినాథ్, ప్రధాన కార్యదర్శిగా తిరుమలి కుమార్, కోశాధికారిగా వెంకటేశ్, కార్యదర్శులుగా చెవుల శంకర్, ప్రవీణ్, వెంకటేశ్, కార్యవర్గ సభ్యులుగా మహేందర్, యాదయ్య, రాములు, సలహాదారులుగా గుండాల రాములు, పెద్దోళ్ల ప్రభాకర్, రామచంద్రయ్య, జంగయ్య ఎన్నికయ్యారు.
సన్మానం..
కురుమ సంఘం మండల అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన కసిరె వెంకటేశ్ యాదవ్ను సంఘం సభ్యులు ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమలు రాజకీయంగా చైతన్య వంతులై ఐక్యంగా ఉండాలన్నారు. కురుమల హక్కుల సాధనకు, వారి అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రతి గ్రామంలో కురుమలు 50 శాతం ఉన్నారని, గ్రామ గ్రామాన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.