మంచాల, నవంబర్ 21 : శివనామ స్మరణతో బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం మార్మోగింది. కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కొందరు కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. కార్తిక పుణ్యస్నానాలు చేసి గుండంలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నారు. పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణస్వామి వ్రతాలో పాల్గొన్నారు. మహిళలు తులసి కోట, శివలింగం వద్ద కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కబీర్దాస్ మందిరంలోని నాగన్న పుట్ట, నర్సింహబాబా సమాధితో పాటు కబీర్దాస్ మందిరంలో పూజలు చేశారురు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లో వనభోజనాలు చేశారు.