కేశంపేట, నవంబర్ 19 : రైతుల అభివృద్ధ్దికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలో శనివారం భూతల్లి మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారి బాగు కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రైతు చనిపోతే రైతుబీమా ద్వారా రూ.5 లక్షలు వారి కుటుంబానికి అందజేసి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటలను మహిళా సంఘాలు, పీఏసీఎస్ల ద్వారా సరైన గిట్టుబాటు ధరను కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. రైతులు తాము పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు.
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
మండలంలోని సంతాపూర్, కాకునూరుకు చెందిన సుమారు 40 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎక్లాస్ఖాన్పేటలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీల నాయకులు, ప్రజలు చేరుతున్నారని తెలిపారు. సంతాపూర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ఎద్దు రాములు, నాయకులు ఎండీ సాజిద్, ప్రతాప్రెడ్డి, సత్తయ్య, శ్రీను, సాయిలు, జంగయ్య, యూసుఫ్, సత్యనారాయణ, గౌస్లతో పాటు కార్యకర్తలు పార్టీలో చేరారు. కాకునూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు చాకలి వెంకటేశ్, ఆంజనేయులు, సత్యనారాయణ, జంగయ్య, వాజీద్లు బీఆర్ఎస్లో చేరారు.కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ విశాలాశ్రావణ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో రవిచంద్రకుమార్రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం భగవంత్, సర్పంచ్లు నవీన్కుమార్, ఆంజనేయులు, వెంకట్రెడ్డి, ఎంపీటీసీ మల్లేశ్యాదవ్, నాయకులు మురళీధర్రెడ్డి, లక్ష్మీనారాయణ, ప్రభాకర్రెడ్డి, శ్రావణ్రెడ్డి, వెంకన్నయాదవ్, వెంకటయ్య, భూపాల్రెడ్డి పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : దళిత కుటుంబాలు ఆర్థికాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీకి చెందిన నర్సింగరావుకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన కారును అందజేశారు. కార్యక్రమంలో నాయకులు జూపల్లి శంకర్, చెట్ల నర్సింహులు, పాండురంగారెడ్డి, శ్రీనివాస్, దామోదర్, మల్లేశ్ పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
షాద్నగర్రూరల్ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ మార్కెట్యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్నయాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె కవిత, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖా జా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ మా జీ చైర్మన్ విశ్వం, నాయకులు నారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ వల్లే ..
కొత్తూరు : తెలంగాణలో నిరంతర విద్యుత్ వెలుగులు సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమయ్యాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడలో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కొత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్లాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, కౌన్సిలర్లుశ్రీనివాసులు, మాధవి, నాయకులు దేవేందర్, సత్యనారాయణ, యాదయ్య, జనార్దనచారి తదితరుల పాల్గొన్నారు.