పరిగి, నవంబర్ 16 : ఏ రూపంలో కొలిచినా దేవుడు ఒక్కడేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పరిగిలోని మినీ స్టేడియంలో ఐదు రోజులుగా జరుగుతున్న కార్తిక కోటి దీపోత్సవంలో బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు చేయడంతోపాటు శివలింగానికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి కవిత మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మహేశ్రెడ్డి దంపతులు కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్తిక మాసంలో చేసిన పూజ, భక్తిశ్రద్దలతో చేసే ఏ కార్యక్రమమైనా తొందరగా ఆ దేవుడి వద్దకు చేరుతుందన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించే పూజలను చేసే అవకాశం, చూసే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుందన్నారు. ఇంత మంచి అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు, వారి కుటుంబసభ్యులకు ధన్యవాదాలని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ప్రతిరోజూ రాత్రి 12 గంటల వరకు కార్యక్రమంలో దీపోత్సవాన్ని విజయవంతం చేసినందుకు పరిగి పట్టణ, వికారాబాద్ జిల్లా ప్రజలకు ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు. పరిగి అంటేనే హరీశ్వర్రెడ్డి గుర్తుకు వస్తారన్నారు. వారిని చూడగానే చాలా సంతోషమనిపించిందన్నారు. వారి ఆశీస్సులు ఉన్నందునే ఈ కార్యక్రమం ఐదు రోజులు దిగ్విజయంగా పూర్తయిందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించి పరిగి నియోజకవర్గ ప్రజలకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డిని అభినందించారు. పాల్గొన్న వారందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్సీ కోరుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్రెడ్డి-గిరిజాదేవి దంపతులతో ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపు మాట్లాడి హరీశ్వర్రెడ్డి ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ ఉత్సవంలో రుద్ర సహిత చండీ అభిషేకం, మీనాక్షి సమేత సుందరేశ్వరస్వామి కల్యాణం, కార్తిక దీపోత్సవం, కోటి దీప ప్రజ్వలన, నవ విధ హారతుల కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యక్రమంలో వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్రెడ్డి-గిరిజాదేవి దంపతులు, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి-ప్రతిమారెడ్డి దంపతులు, వికారాబాద్, చేవెళ్ల, కొడంగల్ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, పట్నం నరేందర్రెడ్డి, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, సీనియర్ నాయకులు కొప్పుల అనిల్రెడ్డి-శ్రీదీప్తి దంపతులు, ఎంపీపీలు కరణం అరవిందరావు, అనుసూజ, సత్యమ్మ, జడ్పీటీసీలు హరిప్రియ, మలిపెద్ది మేఘమాల, పరిగి, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్లు ముకుంద అశోక్, మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మాజీ సర్పంచ్ సిద్దాంతి పార్థసారథి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మేడిద రాజేందర్, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, ప్రభాకర్గుప్తా, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్ పాల్గొన్నారు.
వికారాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ ఆహ్వానంమేరకు బుధవారం ఎమ్మెల్సీ కవిత రాగా ఎమ్మెల్యే ఆనంద్ దంపతులు మొక్కను అందజేసి స్వాగతం పలికారు. సన్మానించి జ్ఞాపికను బహుకరించారు.