చేవెళ్ల రూరల్, నవంబర్ 16 : గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం చేవెళ్ల మండల పరిధిలోని పామెన, అల్లవాడ, జాలగూడ గ్రామాల్లో శుభోదయం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుభోదయం కార్యక్రమంలో ఇప్పటికే ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని, ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా శుభోదయంలో తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పల్లెల్లో ప్రగతి కనువిందు చేస్తున్నదని, ఇదివరకు లేని సంక్షేమ, అభివృద్ధి ఫలాలు పేదలకు అందుతున్నాయన్నారు. ప్రజా క్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు. పామెన, అల్లవాడ, జాలాగూడ గ్రామాల్లోని వృద్ధులు, వితంతువులు, ది వ్యాంగులకు పింఛన్ వస్తుందా.. ఎవరు ఇస్తున్నారు అని ఎమ్మెల్యే అడిగితే కేసీఆర్ ఇస్తుండు అని హర్షం వ్యక్తం చేస్తూ ప్రజల నుం చి సమాధానాలు రావడంతో ఎమ్మెల్యే కాలె యాదయ్య సంతృ ప్తి వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, సర్పంచ్లు మల్లారెడ్డి, యాలాల భీంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, సివిల్ సైప్లె జిల్లా డైరెక్టర్ రవీందర్, రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఎదిరె రాములు, ఎంపీడీవో హిమబిందు పాల్గొన్నారు.
మొయినాబాద్ : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై మరింత అవగాహన కలిగేలా పార్టీ శ్రేణులు అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని ఎమ్మెల్యే యాదయ్య సూచించారు. మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన వాంకడ సుభాశ్ చంద్రబోస్ను టీఆర్ఎస్ సోషల్ మీడియా సెల్ అధ్యక్షుడిగా నియమిస్తూ ఎమ్మెల్యే నియామక పత్రం అందజేశారు. సోషల్ మీడియా ద్వారా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ గునుగర్తి నక్షత్రం, వెంకటాపూర్ సర్పంచ్ మనోజ్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డి మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, ఎంఏ రవూఫ్, బాల్రాజ్, ప్రధాన కార్యదర్శి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
మండల అధ్యక్షుడిగా సుభాశ్ చంద్రబోస్