తలకొండపల్లి, నవంబర్ 16 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం తలకొండపల్లి మండల కేంద్రంతో పాటు వెల్జాల్, చుక్కాపూర్, గట్టుఇప్పలపల్లి, పడకల్ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను సింగిల్విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ నిర్మలతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు. ఎఫ్సీఐ ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని కొనకపోవడం రైతుల హక్కులను హరించినట్లేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముందు భాగంలో నిలిపారని అన్నారు.
రాష్ట్రంలో రైతుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు ఉచిత విద్యుత్, ఎకరాకు రెండు పంటలకు రూ.10 వేల పెట్టుబడి సహకారం, రుణమాఫీతో పాటు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదని అన్నారు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు రూ. 25 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటేశ్, సింగిల్విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, వైస్ చైర్మన్ రవికుమార్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు రహమాన్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, రైతుసమితి మండల అధ్యక్షుడు నర్సింహ, సర్పంచ్లు లలిత, శ్యాంసుందర్రెడ్డి, కిష్టమ్మ, ఎంపీటీసీ అంబాజీ, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ ఇమ్రాన్ పాల్గొన్నారు.
పత్రిక విలేకరులు నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజల సమస్యలను వెలికి తీయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎంపీపీ నిర్మల అన్నారు. బుధవారం తలకొండపల్లి మండల విలేకరులను జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మీడియా సంక్షేమానికి వంద కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కేశవరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, వైస్ చైర్మన్ రవికుమార్ జర్నలిస్టులు యాదగిరి, విష్ణువర్ధన్, తిరుపతయ్య, వెంకట్రెడ్డి, చంద్రకుమార్, శంకర్, శేఖర్, రాజు, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.