ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా మార్పు చెందడం దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక నిర్ణయమని పలువురు ఉద్యమకారులు, నేతలు ఈ సందర్భంగా అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి రెండు పర్యాయాలు ప్రజల దీవెనలతో అధికారంలోకి రాగా, తెలంగాణను అన్ని రంగాల్లో ముందుంచడం లోనూ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వాల విధానాలకు విసిగిపోయిన దేశ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించి టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చడం ఆనందదాయకమన్నారు. దేశాభివృద్ధికి పాటు పడుతున్న సీఎం కేసీఆర్ వెంటే ఉంటామంటున్నారు ప్రజలు, ఉద్యమకారులు.
– న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 5
సీఎం కేసీఆర్ రాకతో దేశ రాజకీయల్లో పెను మార్పు వస్తున్నది. 14సంవత్సరాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా స్వరాష్ట్ర సాధనలో అమరణదీక్ష చేసిన మహానేత, ఇలాంటి వారు దేశ రాజకీయాల్లోకి వస్తే దేశాభివృద్ధిలో మార్పులు వస్తాయి. దేశంలోని రాష్ర్టాలను తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చేయగల సమర్థవంతమైన నాయకుడు సీఎం కేసీఆర్.
– గౌడిచర్ల నర్సింహ, జనవాడ గ్రామం, శంకర్పల్లి మండల
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలి. తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశమంతా అందాలి. అది సీఎం కేసీఆర్తోనే సాధ్యం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుతో అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకియాల్లోకి రావడం దేశంలోని నిరుద్యోగ యువతకు చాలా అవసరం.
– కొంతం చంద్ర శేఖర్రెడ్డి, ఐటీ ఉద్యోగి, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ
తెలంగాణకు 24 గంటలు వెలుతురు అందిస్తున్న విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్. మంచి పరిపాలన అందిండచంతో రెండో సారి ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు తాకుతున్నాయి. సీఎం కేసీఆర్ దేశ రాజకీయల్లోనికి ప్రవేశంతో ప్రజల ఆదరణ పొంది దేశంలో పెద్ద జాతీయ పార్టీగా అవతరించబోతుంది.
-జె. స్వప్నసతీష్కుమార్, ఉద్యమకారులు, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు
తెలంగాణ ఉద్యమం సమయంలో ఏనాడు కంటినిండ నిద్ర ఉండేదికాదు. కొన్నికొన్ని సందర్భాల్లో బావుల వద్ద ఉండి రాస్తారోకోలు చేశాం. ఉద్యమ సమయంలో నా కాలు విరిగిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి దివంగత నేత నరేందర్ మా ఇంటికి వచ్చి పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేశాం. రాష్ట్ర ఏర్పాటు తరువాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలై, అభివృద్ధి జరిగింది. అలాగే దేశంలో కూడా సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమవుతుంది.
– వంగేటి లక్ష్మారెడ్డి, ఉద్యమ నాయకులు
తెలంగాణ ఉద్యమంలో తమ ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపాం. సకలజనుల సమ్మె జరిగినన్ని రోజులూ రోడ్లపైనే ఉన్నాం. రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్లాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు రోడ్లపైకి చేరటం జిల్లా చరిత్రలోనే మరిచిపోని సంఘటన. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇతర రాష్ర్టాలు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కోరుకుంటున్నయి.
– మహ్మద్ గౌస్, ఉద్యోగి, ఇబ్రహీంపట్నం
నాటి ఉద్యమ రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమించాం. ఆ సమయంలో ఎన్నో కేసులు నమోదైనప్పటికీ వాటిని లెక్కచేయకుండా ఉద్యమంలో ముందుండి పోరాడాం. సకల జనుల సమ్మెతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు సమ న్యాయం చేస్తున్నారు.
-డబ్బికార్ శ్రీనివాస్, ఉద్యమనాయకుడు
అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్గా నిలిచింది. ఇదే తరహాలో దేశంలో అభివృద్ధి జరిగితే ప్రతి సామాన్యుడికి ప్రభుత్వ ఫలాలు దక్కుతాయి. దేశం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ సేవలు దేశ వ్యాప్తం కావాలి. 8 సంవత్సరాల కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని స్వర్ణయుగం చేశారు. రైతులకు రైతు బంధు, రైతు బీమాతో వారి కుటుంబాలకు భరోసాను కల్పించారు. మా సంపూర్ణ మద్దతు కేసీఆర్కే.
– శేరి శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమ కారుడు, ముడిమ్యాల్గ్రామం, చేవెళ్ల మండలం
సీఎం కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. దసరా పండుగ నాడు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీకి శ్రీకారం చుట్టడం గొప్ప పరిణామం. కేంద్రంలో ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయం.
– సయ్యద్ ఇబ్రహీం, ఉద్యమకారుడు,షాబాద్
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడంతో 14 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. తెలంగాణలో జరిగిన మార్పు దేశవ్యాప్తంగా జరిగేందుకు కేసీఆర్ కొత్తపార్టీ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం మంచి తరుణం. సబ్బండ వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందన్న నమ్మకం ఉంది.
– వెంకటేశ్చారి ఎంపీటీసీ, తెలంగాణ ఉద్యమకారుడు, తాండూరు