మొయినాబాద్, అక్టోబర్ 3 :ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే ప్రశాంతత ఉంటుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలోని దుర్గా మాత పూజల్లో పాల్గొని పూజలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మండప నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించారు. సురంగల్ లో యువకులు ప్రత్యేక పూజలు చేశారు.
చేవెళ్లటౌన్ : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని రచ్చబండ వద్ద ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారికి పూజలు చేశారు. 7వ రోజు దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి , భక్తులు, నాయకులు శ్రీధర్ రెడ్డి, మాణిక్యరెడ్డి, గ్రామస్తులు తదితరులు ఉన్నారు..
మండపం వద్ద అన్నదానం
అబ్దుల్లాపూర్మెట్ : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇనాంగూడ గ్రామ పంచాయతీ యశోదనగర్ కాలనీలో నెలకొల్పిన దుర్గామాత వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ అంతటి యశోద ముఖ్యఅతిథిగా హాజరై పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
షాద్నగర్రూరల్ : మండలంలోని అతి పవిత్ర పురాతన ఎలికట్ట అంబ భవానీ దేవాలయంలో సోమవారం భవానీమాతను దుర్గాదేవిగా అలంకరించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ నరేందర్, సీనియర్ నాయకుడు శ్రీనివాస్రెడ్డి, ప్రముఖ సామాజిక విద్యావేత్త సోమిరెడ్డి నరేందర్రెడ్డి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయ పునర్నిర్మాణ పనులకు సోమిరెడ్డి నరేందర్రెడ్డి రూ. 6 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
శంకర్పల్లి : ఆధ్యాత్మిక చింతనతో మనస్సుకు ప్రశాంతత కలుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్కుమార్ అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని విఠలేశ్వరాలయంలో చండి హోమం నిర్వహించారు.
కడ్తాల్ : మండలంలో దసరా దేవీశరన్నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి, ఆలయ ఫౌండర్ ట్రస్టీ శిరోలీపంతూనాయక్, ఈవో స్నేహలత, ఆలయ అర్చక సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రోత్సవాలు
ఆమనగల్లు : మండల వ్యాప్తంగా శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం హోమం చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో యాదయ్య, పాండయ్య, కండే సుమన్, నర్సింహ, శ్రీనివాస్, మల్లేశ్, కృష్ణ పాల్గొన్నారు.
షాబాద్ : నవరాత్రి ఉత్సవాలు గ్రామాల్లో అంగరంగా వైభవంగా జరుపుకుంటున్నారు. మల్లారెడ్డిగూడ, షాబాద్, తాళ్లపల్లి, సర్దార్నగర్, హైతాబాద్ తదితర గ్రామాల్లో దుర్గామాత విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.