నందిగామ, అక్టోబర్ 3 : సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, అందుకే దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలంలోని చేగూరు, వెంకమ్మగూడ, వీర్లపల్లి, మొదళ్లగూడ, మామిడిపల్లి, శ్రీనివాసులగూడ, ఈదులపల్లి గ్రామాల్లో సోమవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అన్ని మతాల పండుగలను ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తూ కానుకలను కూడా పంపిణీ చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, సర్పంచ్లు సంతోష, రజనీత, రాములమ్మ, ఉమారెడ్డి, కవిత, చంద్రారెడ్డి, స్వామి, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, ఎంపీటీసీలు కట్న లత, మాధవి, ఎంపీడీవో బాల్రెడ్డి, నాయకులు శ్రీశైలం, బేగ్, నర్సింహ, వీరేందర్గౌడ్, శ్రీశైలం, రవి, సురేశ్, శేఖర్ పాల్గొన్నారు.
దేశానికి ఆదర్శంగా తెలంగాణ పాలన
కొత్తూరు : తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశం కోరుకుంటున్నదని, అందుకే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండలంలోని మక్తగూడ, గూడూరు, మల్లాపూర్ గ్రామాల్లో సోమవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ పూల పండుగ బతుకమ్మను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ అని, ఆ పండుగను ఘనంగా జరుపుకోవాలని బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్, ఎంపీడీవో శరత్ చంద్రబాబు, సర్పంచ్లు కాట్నరాజు, సత్తయ్య, సాయిలు, రవినాయక్, ఉప సర్పంచ్లు పిన్నింటి హరిత, దయానంద్గుప్తా పాల్గొన్నారు.
సామాజిక సేవ అభినందనీయం
కేశంపేట : అకాల మరణం చెందిన తన కొడుకు జ్ఞాపకార్థం ప్రముఖ కాంట్రాక్టర్ యెన్నం గోపాల్రెడ్డి ప్రతి సంవత్సరం పేద ప్రజలకు వస్త్రదానం, అన్నదానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని సంగెంలో ప్రముఖ కాంట్రాక్టర్ యెన్నం గోపాల్రెడ్డి కుమారుడు ప్రసూన్రెడ్డి 39వ జయంతి సందర్భంగా సోమవారం ఆయన జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల నిరుపేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రసూన్రెడ్డి జ్ఞాపకార్థం గ్రామ పేద ప్రజల కోసం 6 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన వాటర్ఫిల్టర్ను ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ రేణుక, జడ్పీ వైస్చైర్మన్ గణేశ్, ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ విశాల, కుటంబ సభ్యులు సుకన్య, ప్రవీణ్రెడ్డి, నవీన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మురళీధర్రెడ్డి, పల్లెనర్సింగ్రావు, శ్రావణ్రెడ్డి, వెంకన్నయాదవ్, భూపాల్రెడ్డి, వేణుగోపాలాచారి, రాఘవేందర్గౌడ్, యాదగిరి పాల్గొన్నారు.