ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 2: సీఎం కేసీఆర్ ప్రభు త్వం వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ల పంపి ణీ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో ముమ్మరం సాగుతున్నది. దసరా పండుగకు ముందే పింఛన్ల డబ్బులు చేతికి అందుతుండటంతో లబ్ధిదారుల ముఖంలో చిరునవ్వు కనిపిస్తున్నది. 57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తామని సీఎం ఇచ్చిన హామీ మేరకు జిల్లాకు 54,000 కొత్త పింఛన్లు మంజూరు కాగా.. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్ గుర్తింపు కార్డులను అందించారు. కార్డులు తీసుకున్న కొన్ని రోజుల్లోనే చేతికి డబ్బులు అందుతుండటంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త, పాత పింఛన్దారులందరూ కలిసి జిల్లాలో దాదాపుగా 2,11,000 మంది లబ్ధిదారులుండగా..వారికి ప్రభుత్వం ప్రతినెలా రూ.74 కోట్ల నిధులను విడుదల చేయనున్నది. ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాలతోపాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అక్టోబర్ 1వ తేదీ నుంచే బ్యాంకు అకౌం ట్లు ఉన్న వారికి నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండగా.. అకౌంట్లు లేని వారికి అధికారులు డబ్బులను పంపిణీ చేస్తున్నారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక..
జిల్లాలో ఆసరా పింఛన్ల ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది. ఎలాంటి పైరవీలకు తావులేకుండా ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. ఆధార్కార్డు ఆధారంగా 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్ గుర్తింపు కార్డులను అధికారులు అందించారు. దరఖాస్తు చేసిన కొన్ని రోజుల్లోనే పింఛన్ డబ్బులు బ్యాం కు ఖాతాల్లో జమ అవుతుండటంతో లబ్ధిదారు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ పలు గ్రామాల్లో బ్యాంకు ఖాతాల్లేని పలువురు లబ్ధిదారులకు అధికారులు పింఛన్ డబ్బులను చేతికి అందించారు.
జిల్లాలో కొత్తగా 54 వేల మందికి ..
ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాకు 54,000 కొత్త పింఛన్లను మంజూరు చేయగా.. దరఖాస్తు చేసుకున్న వారందరికీ అధికారులు పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. గతంలో జిల్లాలో లక్షా57 వేల మంది పింఛన్ లబ్ధిదారులుండగా…వారితోపాటు కొత్తగా 54 వేల మందిని కలిపితే పింఛన్దారుల సంఖ్య దాదాపుగా 2,11,000 మందికి చేరింది. వీరికి చెల్లించేందుకు ప్రభుత్వం ప్రతినెలా రూ. 74 కోట్ల నిధులను మంజూరు చేయనున్నది. కాగా సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్లను పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని పలువురు లబ్ధిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద కొడుకుగా నిలిచిన కేసీఆర్..
సీఎం కేసీఆర్ 57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్లను పంపిణీ చేస్తూ వృద్ధ్దులకు పెద్ద కొడుకుగా నిలిచారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ఎవరైనా చనిపోతే వారి స్థానంలో నూతన పింఛన్ను వృద్ధులకు మంజూరు చేసేవారు. కానీ, సీఎం కేసీఆర్ వృద్ధులకు ఆసరాగా ఉండేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లను పంపిణీ చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు.
-మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
వృద్ధాప్యంలో ఆసరా పింఛన్లను అందించి ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు జీవితమంతా రుణపడి ఉంటాం. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మాకు కూడా ప్రతినెలా పింఛన్ డబ్బులు అందించి ఆసరాగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు బతకాలి.
-దుబ్బాకుల వీరమణి, ఆదిబట్ల