షాద్నగర్ రూరల్, అక్టోబర్ 2 : ఆలయాల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నదని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని ఎలికట్ట అంభభవానీ దేవాలయంలో ఆదివారం సీనియర్ నాయకుడు బెంది శ్రీనివాస్రెడ్డి, గ్రామ సర్పంచ్ సాయిప్రసాద్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్వహించిన భజన, పల్లకీ సేవలో వారు పాల్గొన్నారు. యువగాయకులు నర్సింహ, శివ పాడిన భజన పాటలకు భక్తులు పరవశించిపోయారు. సోమవారం అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ప్రధాన అర్చకులు భవానీశంకర్, పూజారి మల్లేశ్ తెలిపారు.
షాద్నగర్ పట్టణంలో..
దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం పట్టణంలోని శివమారుతిగీతా అయ్యప్ప మందిరం, వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయం, పెద్ద జానమ్మపేట లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. శివమారుతిగీతా అయ్యప్ప మందిరం ఆవరణలో మహిళలు కుంకుమార్చన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. పట్టణంలోని గాంధీనగర్కాలనీలో మాజీ వార్డు సభ్యుడు చేగూరి వేణుగోపాల్ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాతకు ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, మాజీ చైర్మన్ విశ్వం, కాలనీవాసులు భవానీ వేణుగోపాల్, వినోద్కుమార్, కుమార్, చిన్నయ్య, రమేశ్, ప్రదీప్, శ్రీనివాస్, అభిలాష్, సాయి, చరణ్, శ్రీకాంత్, చంద్రకళ, శైలజ పాల్గొన్నారు.
కడ్తాల్ మండలంలో..
మండల కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయంతోపాటు, మైసిగండి గ్రామంలోని రామాలయ, శివాలయాల్లో అన్నపూర్ణేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం కడ్తాల్, మైసిగండిలోని అమ్మవార్లు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాల్లో కుంకుమార్చనలు, హారతి, అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్పీ జ్యోతి, ఈవో స్నేహలత, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శిరోలీపంతూనాయక్, మాజీ సర్పంచ్ శేఖర్గౌడ్, అరుణ్నాయక్ పాల్గొన్నారు.