కొత్తూరు, సెప్టెంబర్ 28: ఫిర్యాదుల స్వీకరణలో మహిళలకు ఇబ్బందులు కలుగవద్దనే ఉద్దేశంతో పోలీస్టేషన్లలో ప్రత్యేకంగా మహిళా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ బుధవారం కొత్తూరు పోలీస్ స్టేషన్లో మహిళా సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ పోలీస్ స్టేషన్కు న్యాయం కోసం వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకూడదనే ఉమెన్ హెల్ప్ డెస్క్ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. అనంతరం డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ న్యాయం కోసం వచ్చే మహిళలు ఇక ఎలాం టి ఇబ్బందులు లేకుండా తమ సమస్యలను చెప్పుకోవచ్చన్నారు. కార్యక్రమంలో షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, సీఐ బాలరాజు, రూరల్ సీఐ సత్యనారాయణ, నందిగామ సీఐ రామయ్య, కొత్తూరు ఎస్ఐ శంకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్యాదవ్, ఎమ్మె సత్యనారాయణ, శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు.
షాద్నగర్ : తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దన్న లాంటి వారని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో బతుకమ్మ చీరను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదన్నారు. అనంతరం లింగారెడ్డిగూడ గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని బతుకమ్మను ఆడారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ మాధవి, ఎంపీటీసీ రామకృష్ణ, ఎంపీడీవో వినయ్కుమార్, మహిళలు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.
షాద్నగర్, సెప్టెంబర్ 28 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మహాత్మా జ్యోతిరాబాఫూలే గురుకుల పాఠశాలను చౌదరిగూడ మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ తెలిపారు. బుధవారం చౌదరిగూడ మండల కేంద్రంలో పాఠశాల ఏర్పాటు కోసం ఓ ప్రైవేట్ భవనాన్ని పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. త్వరలోనే చౌదరిగూడలో గురుకుల పాఠశాల ప్రారంభం అవుతుందని తెలిపారు.