రంగారెడ్డి జిల్లాలో కొత్త ఆసరా లబ్ధిదారులకు మరో రెండు రోజుల్లో పింఛన్ డబ్బులు అందనున్నాయి. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రొసీడింగ్స్ ప్రక్రియను పూర్తి చేయగా.. ప్రభుత్వం నిధులను కలెక్టర్ ఖాతాకు విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా కొత్తగా 52,422 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. దీంతో జిల్లాలో ఆసరా పింఛన్దారుల సంఖ్య 2,10,275కు చేరింది. వీరి కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.56 కోట్లను వెచ్చించనున్నది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనున్నారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని కొత్త పింఛన్దారులకు ఒకటి, రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. అయితే మృతి చెందిన వారితోపా టు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుటుంబానికి చెం దిన వారు, ఒకే ఇంట్లో ఇద్దరు పింఛన్దారులు, కారు కలిగి ఉండడం, మూడెకరాల తరి భూమి, 7.5 ఎకరాలకు మించి బీడు భూమి ఉన్న వారిని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అనర్హులుగా తేల్చారు. ఇలా రంగారెడ్డి జిల్లాలో 2,239 మందిని అనర్హులుగా గుర్తించిన అధికారులు వారి ని కొత్త పింఛన్ల జాబితా నుంచి తొలగించి.. మిగ తా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ డబ్బులను అందించేందుకు చర్యలను ముమ్మరం చేశారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. మరోవైపు ప్రభుత్వం జిల్లాకు మంజూరైన పింఛన్లకు సంబంధించి అవసరమైన నిధులను ఇప్పటికే మంజూరు చేసింది. ఎలాంటి దిక్కులేని వారి ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
రంగారెడ్డి జిల్లాలోని కొత్త పింఛన్దారులకు ఒకటి, రెం డు రోజుల్లో డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఇప్పటికే ఆధార్ అనుసంధానంతోపాటు బ్యాంకు ఖాతాల వివరాలనూ ఆన్లైన్లో ఎంట్రీ చేశా రు. జిల్లాలో 57 ఏండ్లు నిండిన వారితోపాటు పెండింగ్లో ఉన్న దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులను కలిపి 54,661 మందికి కొత్త పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అత్యధికంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 10,025 కొత్త పింఛన్లు, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 8,089, మహేశ్వరంలో 7,794, షాద్నగర్లో 7,136, ఎల్బీనగర్లో 6,404, చేవెళ్లలో 6,140, కల్వకుర్తి నియోజకవర్గంలో 4,697 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. అయితే కొత్త పింఛన్ల జాబితాలో 2,239 మందిని ప్ర భుత్వం అనర్హులుగా గుర్తించి వారిని కొత్త పింఛన్ జాబి తా నుంచి తొలగించింది. దీంతో జిల్లాలో కొత్త పింఛన్దారులు 52,422 మందిని అర్హులుగా గుర్తించి ప్రొసీడింగ్స్ను కూడా సిద్ధం చేసింది. కాగా కొత్త పింఛన్దారులతో కలిసి జిల్లాలో పింఛన్ల సంఖ్య 2,10,275కు పెరుగగా.. ప్రభుత్వంపై అదనంగా మరో రూ. 19.61 కోట్ల భారం పడనున్నది.
గతనెల వరకు జిల్లాలో వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు కలిపి 1,57, 853 మంది ఆసరా పింఛన్దారులుండగా..ప్రతినెలా రూ. 36.72 కోట్ల చొప్పున ప్రభుత్వం జిల్లాకు కేటాయించేది. వచ్చే నెల నుంచి ప్రభుత్వం కొత్త, పాత పింఛన్ల పంపిణీకి ప్రతినెలా రూ.56.33 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జిల్లాలో 1,57,853 మంది ఆసరా పింఛన్దారులుండగా.. వారిలో వయోవృద్ధులు-49,153, వితంతువులు-74,612, దివ్యాంగులు- 25,479, గీత కార్మికులు-1945, చేనేత కార్మికులు-742, ఒంటరి మహిళలు-5864, బీడీ కార్మికులు-15 మంది పింఛన్దారులున్నారు.
ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త పింఛన్దారులకు వారి బ్యాంకు ఖా తాల్లో రెండురోజుల్లో డబ్బులు జమ కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నిధులను మంజూరు చేయగా.. ప్రొసీడింగ్స్ ప్రక్రియను కూడా పూర్తి చేశాం. వచ్చే నెల నుంచి ప్రభు త్వం కొత్త, పాత పింఛన్ల పంపిణీకి ప్రతినెలా జిల్లాకు రూ.56.33 కోట్ల చొప్పున కేటాయించాల్సి ఉంటుం ది.
-ప్రభాకర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి