ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 27:సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్తోపాటు తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు భేష్ అని పలువురు కొనియాడుతున్నారు. పేదలకు ప్రభుత్వ దవాఖానల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న సర్కార్.. మాతాశిశు సంరక్షణకు సంబంధించి తల్లులకు పౌష్టికాహారం అందించడంతోపాటు పుట్టిన బిడ్డకు ఎలాంటి వ్యాధులు సోకకుండా అవసరమైన కిట్లను అందించి మాతాశిశు మరణాలను తగ్గిస్త్తున్నది. ఒకటి, రెండో ప్రసవాలకు సంబంధించి ప్రభుత్వ దవాఖానల్లో బిడ్డకు జన్మనిస్తే కేసీఆర్ కిట్ ఇవ్వడంతోపాటు ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12వేలు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో 2017 నుంచి ఈ పథకాన్ని చేపడుతున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహిళా లోకం కోరుతున్నది.
దేశమంతటా కేసీఆర్ కిట్- కె.మాధురి, బాలింత, షాద్నగర్
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే మన రాష్ట్రంలో బాలింతల కోసం పంపిణీ చేస్తున్న కేసీఆర్ కిట్ దేశమంతటా వర్తిస్తుంది. తల్లీబిడ్డల క్షేమం కోసమే కేసీఆర్ కిట్ను ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్. అందుకే జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఆడబిడ్డ జన్మిస్తే రూ.13వేలు, మగబిడ్డ జన్మిస్తే రూ.12వేలు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ కిట్స్ అమలు తర్వాత సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. దేశమంతటా దీన్ని అమలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆడపడుచులకు అన్నలా.. చిన్నారులకు మేనమేమలా..
గర్భిణులు పురుడు పోసుకోవడానికి ఇంటి నుంచి అమ్మ ఒడి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి కాన్పు తరువాత తల్లిబిడ్డను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేలు అందించి ఆరోగ్యానికి ఆసరా అందిస్తున్నారు. కేసీఆర్ ఆడపడచులకు అన్నలా.. చిన్నారులకు మేనమామలా ఆదరిస్తున్నారు. తెలంగాణలోనే ఈ సౌకర్యాలను అందుకుంటున్నాం. ఇటువంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో వస్తే దేశంలోని మహిళలకు ఎంతో అండగా ఉంటుంది. పుట్టింటి లాంఛనాలను అందించేలా అన్నింటా సౌకర్యాలు కల్పిస్తున్న సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
– కల్పన, చిన్ననందిగామ, కొడంగల్
ప్రజారోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజారోగ్యానికి సంబంధించిన పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ కిట్లు, పౌష్టికాహారం, అమ్మ ఒడి పథకాలు మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మహిళలంతా అండగా నిలుస్తాం. దేశవ్యాప్తంగా ఎంతోమంది పేద మహిళలున్నారు. అలాంటివారికి ఇలాంటి పథకాలు ప్రవేశపెడితే బాగుంటుంది.
-కొంకని శ్రీలత, ఇబ్రహీంపట్నం
కేసీఆర్ కిట్లు ఎంతగానో బాగున్నాయి
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సర్కారు దవాఖానల్లో మాతాశిశువుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇలాంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలంటేనే గతంలో భయపడేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్లు ఇతరత్రా వైద్య సదుపాయాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
– వరికప్పు లక్ష్మి, ఇబ్రహీంపట్నం
అందరికీ మేలు జరుగుతుంది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంతి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి అవసరమైన పథకాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. గతంలో గర్భం దాల్చితే ప్రైవేట్ దవాఖానల్లో వేలకు వేలు ఖర్చు చేసి ప్రసవాలు చేయించుకునేవారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మహిళలకు కేసీఆర్ కిట్టు ఎంతో ఉపయోగపడుతున్నది. ఇలాంటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు.
– కె.మాధవి, మోమిన్ఖుర్దు, ధారూరు మండలం
కాన్పుల సంఖ్య పెరిగింది
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్టుతో సర్కారు దవాఖానల్లో కాన్పుల సంఖ్య పెరిగింది. గర్భం దాల్చినప్పటి నుంచి ఆరోగ్య కార్యకర్తలు తరచూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సూచనతో ఎక్కువ శాతం నార్మల్ ప్రసవాలు జరుగుతున్నాయి. కాన్పు అయిన తర్వాత పుట్టిన శిశువుతోపాటు ప్రసవించిన మహిళకు అవసరమైన వస్తువులు ఇవ్వడం ఎంతో సంతోషించదగ్గ విషయం.
– ప్రియాంక, నజీరాబాద్తండా, పరిగి మండలం
కేసీఆర్ కిట్టు బాలింతలకు వరం
కేసీఆర్ కిట్టు బాలింతలకు వరంగా మారింది. దీంతో కాన్పుల సంఖ్య పెరిగి మాతా శిశు మరణాల సంఖ్య తగ్గింది. గతంలో గర్భం దాల్చితే ప్రైవేట్ దవాఖానల్లో వేలకు వేలు ఖర్చు చేసి ప్రసవాలు చేయించుకునేవారు. కేసీఆర్ కిట్టు వచ్చిన తర్వాత ధనిక, బీద మహిళలు సర్కారు దవాఖానలకు వెళ్లి కాన్పులు చేయించుకుంటున్నారు. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– ఎస్.మంజుల, చిగురాల్పల్లి, పరిగి మండలం
సంక్షేమ పథకాలు బాగున్నాయి
సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నారు. కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తూ అండగా ఉంటున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఖర్చు లేకుండా డెలివరీ చేయడమే కాకుండా కేసీఆర్ కిట్తోపాటు బ్యాంకుల్లో విడుతల వారీగా డబ్బులు జమ చేస్తున్నారు. దేశంలో ఉన్న పేద ప్రజల భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి.
– శ్రావణి, జల్పల్లి
చాలా ఆనందంగా ఉంది
శ్రీరాంనగర్ ప్రభుత్వ దవాఖానలో మొదటి పాపకు జన్మనిచ్చాను. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కిట్ ఇవ్వడంతో చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాలాంటి పేదింటి బిడ్డలకు సర్కారు దవాఖానల్లోనే నాణ్యమైన ఆహారం అందిస్తూ.. అన్ని వసతులు కల్పించడంతోపాటు ఇంటికి వెళ్లాక ఇబ్బందులు పడకుండా బిడ్డకు కావాల్సిన అన్ని వస్తువులతో కేసీఆర్ కిట్ ఇవ్వడం సంతోషాన్నిచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లి ఈ పథకాన్ని ప్రవేశపెట్టి నాలాంటి ఆడబిడ్డలకు సాయం చేస్తే ఎంతో బాగుంటుంది. మహిళల మద్దతు ఎప్పుడూ కేసీఆర్కే ఉంటుంది.
– స్వరూప, హెచ్ఎఫ్నగర్, రహ్మత్నగర్
పేదింటి మహిళలకు అండగా..
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించడం శుభ పరిణామం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మహిళలు, గర్భిణులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. పేదింటి మనసులను ఎరిగిన నాయకుడిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. మహిళలకు సముచిత గౌరవం కల్పించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. అటువంటి గొప్ప నాయకుడు దేశ రాజకీయాల్లోకి అడుగుపెడితే అన్ని రాష్ర్టాలలోని పేద మహిళలకు ఎంతో న్యాయం జరుగుతుంది. పేదింటి మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి బిడ్డ ప్రసవించే వరకు ఖర్చులు ఇవ్వడంతో పాటు కేసీఆర్ కిట్ను అందించడం అభినందనీయం.