తెలంగాణ దశాబ్ది వేడుకలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముస్తాబైంది. కలెక్టరేట్లతో పాటు ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను అధికారులు విద్యుద్దీపాలు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. రాత్రి విద్యుద్దీపాలు జిగేల్మంటూ కనువిందు చేశాయి.
