యాచారం, జూలై31: పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని గడ్డమల్లాయగూడ గ్రామంలో పెద్దమ్మ తల్లి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలన్నారు.
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. పురాతన ఆలయాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకరిస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, సర్పంచ్ జంగయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్, నాయకులు చిన్నోళ్ల యాదయ్య, జర్కోని రాజు, కల్లూరి శివ, మహ్మద్ ఖాజు, అచ్చన దానయ్య, తలారి సంపత్, ముదిరాజ్ సంఘం నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చర్లపటేల్గూడ గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ నల్లపోచమ్మ విగ్రహప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమంతో పాటు ఆలయాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ : మండల కేంద్రంలో బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కిషన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోచమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ లెక్కల విఠల్రెడ్డి, సర్పంచ్ చెరుకు కిరణ్కుమార్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్, టీఆర్ఎస్వై మండల అధక్షుడు వినయ్రెడ్డి పాల్గొన్నారు.