జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రజాప్రతినిధులు అన్నారు. మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన జీవిత చరిత్రను వివరించారు. ఆయన ఆశయ సాధనలో యువత ముందుభాగంలో ఉండాలన్నారు.
నందిగామ, జూన్ 21 : ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశ య సాధన కోసం కృషి చేయాలని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సర్పం చ్ జిల్లెల వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో జయశంకర్ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెక్కొండ కుమార్గౌడ్, వార్డు సభ్యులు బాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఈశ్వర్యాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్ రాంబాబు, రవి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు లింగంగౌడ్, నాయకులు మురళి, నర్సింహ, రాజీవ్రెడ్డి, సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్, జూన్ 21: తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త, విద్యావేత్త, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని ఆయన విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, నాయకులు పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. షాద్నగర్ గ్రేడ్ 1 గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి గ్రంథాలయ కమిటీ వైస్ చైర్మన్ మహేశ్వర్, కమిటీ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ ప్రభాకర్, నాయకులు రాజావరప్రసాద్, గంగిరెడ్డి, వెంకటేశ్, లక్ష్మణ్, జూపల్లి శంకర్, శరత్, రాఘవేందర్, సాంబశివ, బాలయ్య, మల్లయ్య, వైస్ చైర్మన్ కుమార్, కమిటీ సభ్యులు సుధాకర్, ఆంజనేయులు, పిన్నామోని గోపాల్, ఆజార్, శంకర్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : కొత్తపల్లి జయశంకర్ వర్థంతి సందర్భంగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ పీ కృపేశ్ మాట్లాడుతూ తెలంగాణ ఆశయ సాధన కోసం శ్రమించిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ అని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ మంచిరెడ్డి వెంకటప్రతాప్రెడ్డి, ఎంపీడీవో కా్రంతికిరణ్, తాసిల్దార్ రామ్మోహన్రావు, ఎంపీటీసీ మంగా రవీందర్, ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
కొందుర్గు : కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రాల్లో జయశంకర్ వర్ధంతిని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రొఫెసర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు బాబురావు, వెంకటస్వామి, శ్రీనివాస్, మోత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్ : జయశంకర్ సార్ స్ఫూర్తితో రాష్ట్రం అభివృద్ధికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని జడ్పీటీసీ అనురాధ, ఏఎంసీ వైస్ చైర్మన్ గిరియాదవ్ అన్నారు. ఆమనగల్లు లో జయశంకర్ సార్ వర్ధంతిని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని జయశంకర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు నారాయణ, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటి సభ్యుడు పత్యానాయక్, నిరంజన్గౌడ్, ఏఎంసీ డైరెక్టర్లు, రమేశ్, సుభాశ్ పాల్గొన్నారు.
మొయినాబాద్ : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నక్షత్రం ఆధ్వర్యంలో జయశంకర్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలో విశ్వకర్మ మండల కమిటీ మండల అధ్యక్షుడు సంతోష్చారి ఆధ్వర్యంలో నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్కుమార్, ఎంపీడీవో సంధ్య, ఎస్ ప్రణయ్, ఎంపీటీసీలు బట్టు మల్లేశ్,అర్జున్, రాంరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అనంతరెడ్డి, అంజయ్య పాల్గొన్నారు.
కొత్తూరు రూరల్ : ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎంపీడీవో శరత్చంద్రబాబు అన్నారు. వర్ధంతి సందర్భంగా తహసీల్దార్, ఎం పీడీవో కార్యాలయంలో, వివిధ గ్రామాల్లో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.