రేషన్ కార్డులుండి కుటుంబ సభ్యుల పేర్లు లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా వివాహాలైన, ఇటీవల జన్మించిన వారి వివరాలను మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తైన వెంటనే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కొత్త లబ్ధిదారులకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.
దీని ద్వారా రంగారెడ్డి జిల్లాలో లక్ష మందికి లబ్ధి చేకూరనున్నది. అయితే జిల్లాలో రేషన్ కార్డుల్లో పేర్ల మార్పులు-చేర్పుల కోసం ఇప్పటివరకు 83,139 దరఖాస్తులు రాగా అందులో 3,346 దరఖాస్తులు తిరస్కరణకు గురి కాగా.. మిగిలిన వాటికి అధికారులు ఆమోదం తెలిపారు. జిల్లాలో 5.50 లక్షల తెల్లరేషన్కార్డులుండగా ప్రభుత్వం ప్రతినెలా 27 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జిల్లాకు పంపిణీ చేస్తున్నది.
రంగారెడ్డి, జూన్ 21, (నమస్తే తెలంగాణ) : రేషన్ కార్డులుండి కుటుంబ సభ్యుల పేర్లు లేనివారికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. తమ కుటుంబ సభ్యులను చేర్చాలని రేషన్ కార్డుదారులు గత కొన్నేండ్లుగా విన్నవిస్తుండగా.. ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు లేనివారు ప్రస్తుతం మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
కొత్తగా పళ్లైనవారి వివరాలు, పుట్టిన పిల్లల వివరాలను రేషన్ కార్డులో పొందుపర్చుకునేందుకు అవకాశమిచ్చారు. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చేందుకుగాను పాత లేదా కొత్త రేషన్ కార్డు నెంబర్, రేషన్కార్డు కొత్తగా నమోదు చేసేవారి ఆధార్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ వివరాలతో మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా సమయంలో కొత్త సభ్యులను చేర్చకపోవడంతో ప్రభుత్వం అందించిన ఉచిత బియ్యాన్ని చాలా మంది తీసుకోలేకపోయారు.
ఇప్పటికే కొత్త రేషన్ కార్డులను జారీ చేసిన ప్రభుత్వం కొత్త సభ్యులను చేర్చే ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తైన వెంటనే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం కొత్త లబ్ధిదారులకు కూడా ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష మందికి ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో రేషన్ కార్డుల్లో మార్పులు-చేర్పులకు ఇప్పటివరకు 83,139 దరఖాస్తులురాగా 3346 దరఖాస్తులను తిరస్కరించగా, మిగతా దరఖాస్తులకు సంబంధిత అధికారులు ఆమోదం తెలిపారు.
జిల్లాలో ప్రస్తుతం 5.50 లక్షల తెల్ల రేషన్కార్డులుండగా.. నెలకు 27 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆహారభద్రత పథకం కింద సీఎం కేసీఆర్ రేషన్కార్డుదారులందరికీ ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో పరిమితి లేకుండా కుటుంబ సభ్యులు ఎంత మంది ఉన్నప్పటికీ లబ్ధిదారులందరికీ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డులను కూడా జారీ చేసింది. కొత్త జిల్లాలు ఏర్పాటైన అనంతరం కొత్త కార్డులు జారీ లేకపోవడం, ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం గతేడాది చివరిలో కొత్త కార్డులను జారీ చేసింది.
జిల్లాలో కొత్తగా 21,025 కొత్త రేషన్కార్డులను మంజూరు చేయగా, లబ్ధిదారులకు ఈ ఏడాది జనవరి నుంచి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 21,025 కొత్త రేషన్కార్డులకు జిల్లా పౌరసరఫరాల శాఖ జారీ చేయగా, వీటిలో అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 1236, ఆమనగల్లు-279, బాలాపూర్-1797, చేవెళ్ల-298, చౌదరిగూడెం-186, ఫరూఖ్నగర్-713, గండీపేట-1307, ఇబ్రహీంపట్నం-1007, కడ్తాల్- 174, కందుకూరు-842, కేశంపేట-224, కొందుర్గు-164, కొత్తూరు-226, మాడ్గుల-355, మహేశ్వరం-631, మంచాల-375, మొయినాబాద్-711, నందిగామ- 179, సరూర్నగర్-8287, షాబాద్-305, శంషాబాద్-695, యాచారం-425, శంకర్పల్లి-380, తలకొండపల్లి మండలంలో 274 కొత్త రేషన్ కార్డులను జారీ చేసి జిల్లాలోని 919 చౌక ధర దుకాణాల ద్వారా బియ్యంతోపాటు ఇతర రేషన్ సరుకులను అందజేస్తున్నారు.