టేక్మాల్/ శివ్వంపేట, జూలై 2 : మిషన్ భగీరథ నీటిలో సరైనన్ని పోషకాలు ఉంటాయని, ప్రజలు భగీరథ నీటిని తాగితే ఆరోగ్యంగా ఉంటారని ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ విజయభాస్కర్, సర్పంచ్ నాయికోటి సుప్రజాభాస్కర్, మైక్రోల్యాబ్ టెక్నీషియన్ రమేశ్ వివరించారు. టేక్మాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మిషన్ భగీరథ నీటిలో డీటీఎఫ్ (డీసెంట్రలైజ్డ్ ట్రీట్మెంట్ ఫెసిలిటి) ఖనిజ లవణాలను ప్రయోగాత్మకంగా విద్యార్థులకు చేసి, చూపించారు. భగీరథ నీటిలో డీటీఎఫ్ 150 నుంచి 300 వరకు ఉందని, ఫిల్టర్ నీటి లో 30- 60 ఉంటుందని, ఈ నీటిని తాగితే ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రయోగాత్మకంగా వివరించారు.
మిషన్ భగీరథ నీరు రంగు మారిన, తేడా కనిపించిన వేడి చేసి, చల్లార్చి తాగాలని సూ చించారు. మిషన్ భగీరథ నీటిని వివిధ పద్ధతుల్లో శుభ్రపరుస్తారని, ఈ నీటిని తాగితే శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు వసంత, మాధవచారి, సిబ్బంది ప్రభాకర్, పెంటయ్య, తుకారాం పాల్గొన్నారు.
భగీరథ నీటిలో అధిక లవణాలు ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కమలాకర్ అన్నారు. శవ్వంపేట మండలం పెద్దగొట్టిముక్ల పాఠశాలలో విద్యార్థులకు భగీరథ నీటి ప్రాముఖ్యత వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇంజినీర్ కిషన్, ఏఈ అతిఫ్, సర్పంచ్ చంద్రకళాశ్రీశైలంయాదవ్, టీచర్లు రాజు, శంకర్ పాల్గొన్నారు.