వికారాబాద్, జూలై 1: తల్లిదండ్రులు జన్మనిస్తే, వైద్యులు పునర్జన్మనిస్తారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వికారాబాద్ అనంతగిరిలో వైద్యులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీసీ రాయ్ జయంతి సందర్భంగా డాక్టర్ల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ప్రాణాలను కాపాడే ప్రత్యక్ష దైవాలు డాక్టర్లు అని కొని యాడారు. కరోనా కాలంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవని గుర్తు చేశారు. ప్రజా రోగ్యం కోసం తమ కృషి మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో తుకారం, వైద్యులు ఆనంద్, రవీంద్రయాదవ్ తదితరులు ఉన్నారు.
బొంరాస్పేట, జూలై 1 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం డాక్టర్స్ డేను వైద్య సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. జిల్లా టీబీ నియంత్రణ అధికారి రవీంద్ర యాదవ్ సమక్షంలో పీహెచ్సీ వైద్యుడు అరుణ్, సిబ్బంది, ఏఎన్ఎంలు కేక్కట్ చేసి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రవీంద్ర యాదవ్, డాక్టర్ అరుణ్ను సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా టీబీ నియంత్రణ అధికారి రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ సమాజంలో వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, రోగులు వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తారని అన్నారు. వైద్య సిబ్బంది రోగులకు మంచి వైద్యం అందించి ప్రజల మెప్పు పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఆయూష్ ఫార్మాసిస్టు సుదర్శన్, సూపర్వైజర్ మణిమాల, సిబ్బంది పాల్గొన్నారు.
నవాబుపేట,జూలై1: మండల పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్రాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది, డాక్టర్స్ డేను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని నారేగూడ గ్రామానికి చెందిన ప్రముఖ రిటైర్డ్ హోమియోపతి ప్రొఫెసర్, డాక్టర్ సర్సీవీ రామన్ అవార్డు గ్రహీత పర్వేద మాణిక్రావును వికారాబాద్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ సీహెచ్. జగదీశ్, లక్ష్మయ్య పాఠశాల విద్యార్థులతో కలిసి ఘనం గా సన్మానించారు. ఈ సందర్భంగా మాణిక్ రావు మాట్లాడుతూ కరోనా నివా రణకు హోమియోపతి మందులను స్కూల్ విద్యార్థులకు ఉచితంగా సరఫరా చేస్తానని తెలిపారు. విద్యార్థులు బాగా చదువు కోవాలని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్య క్రమంలో ప్రత్యేక నిఫుణులు సందీప్, పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు పోలీసు రాంరెడ్డి, యాదయ్య, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.