‘మహిళలు ఆర్థికంగా ఎదుగాలి.. చిరు వ్యాపారాలు చేసుకునేందుకు రాష్ట్ర సర్కార్ రుణాలిస్తున్నది.. వారి అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి చేవెళ్లలో మహిళా సంఘాలకు రూ.42 కోట్ల చెక్కులను అందజేయడంతో పాటు మొయినాబాద్ మండలం అజీజ్నగర్లో అంబేద్కర్ భవన నిర్మాణానికి, నవాబుపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. ఆడబిడ్డలను బాగా చదివించి అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. దళితులు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో ‘దళిత బంధు’తో అర్హులైన వారికి రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తున్నామన్నారు.
ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతిని అమలు చేస్తుండడంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. తెలంగాణలో 19 గ్రామాలు జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికయ్యాయన్నారు. మన ఊరు- మనబడితో సకల సౌకర్యాలు సమకూరుతుండడంతో సర్కారు బడులకు మహర్దశ వచ్చిందన్నారు. ఈ ఏడాది కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలవుతుందన్నారు.
చేవెళ్లటౌన్, జూన్ 24: సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.35,83,06,000 కోట్లు, స్త్రీనిధి కింద రూ.6,09,09,000 కోట్ల రుణాల చెక్కులను చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంత్రి సబితారెడ్డి పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్కా రు రుణాలిచ్చి భరోసా కల్పిస్తుండటంతో స్వ యం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. బ్యాంకు లింకే జీ కింద 689 మహిళా సంఘాలకు రూ. 35,83,06,000 కోట్లు, స్త్రీనిధి కింద రూ.6, 09,09,000 కోట్ల రుణాలను మండల మహిళా సంఘాలకు అందించినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు రూ.ఏడు కోట్ల వడ్డీని వెనక్కి ఇస్తే చేవెళ్ల నియోజకవర్గానికి రూ.కోటీ20 లక్షల వడ్డీని వెనక్కి ఇచ్చినట్లు తెలిపారు.
జిల్లాలో రూ. 834 కోట్ల రుణాలను బ్యాంకుల నుంచి తీసుకుంటున్నట్లు వారు చెప్పారు. ఆడ బిడ్డలను బాగా చదివించాలని మహిళలకు సూచించారు. అభయహస్తం పథకం కింద డబ్బులు చెల్లించిన వారికి వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు వారు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశా రు. అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య మా ట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. చిరు వ్యాపారులు మంచి లాభాలను పొందుతున్నామని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తున్నదన్నారు. అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని ఆయన కొనియాడారు.
అనంతరం చేవెళ్ల ఎం పీపీ విజయలక్ష్మీరమణారెడ్డి విరాళంగా ఇచ్చిన బెంచీలను వారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రి న్సిపాల్కు అందజేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి, చేవెళ్ల ఆర్డీవో మాధవరావు, చేవెళ్ల తహసీల్దార్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్రెడ్డి, చేవెళ్ల మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, రవి, పుష్పలత, సర్పంచ్లు మోహన్రెడ్డి, శివారెడ్డి, నరహరిరెడ్డి, మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ జంగారెడ్డి, నాగార్జునరెడ్డి, రమణారెడ్డి, కృష్ణారెడ్డి, రంగారెడ్డి, వెంకటేశ్ ఉన్నారు.
మొయినాబాద్, జూన్ 24: డాక్టర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ప్రతి మండలానికీ ఒకటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అం బేద్కర్ భవన నిర్మాణ పనులకు శుక్రవారం అజీజ్నగర్ పాత గేట్ వద్ద రంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్తో కలిసి మంత్రి సబితారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రా జ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు.
చిన్న రాష్ర్టాలతోనే పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందని ఆయన రాజ్యాంగంలో పొందుపర్చారన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆయన ఆశయసాధనలో భాగంగా ప్రతి మండలానికీ ఒక అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ భవన నిర్మాణాలకు నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నదని కొనియాడారు. దళితు లు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అర్హులకు రూ. పది లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు వివరించారు.
కార్యక్రమంలో సర్పంచ్ సంధ్య, ఎంపీటీసీ సుజాత, ఉపసర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఆర్డీవో వేణుమాధవ్, పీఆర్, మిషన్ భగీరథ పథకం డీఈలు విజయ్కుమార్, రాజేశ్, తహసీల్దార్ అశోక్కుమార్, ఎంపీడీవో సంధ్య, మాజీ జడ్పీటీసీలు అనంతరెడ్డి, చంద్రలింగంగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, సుధాకర్యాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజు, ఆంజనేయులుగౌడ్, నర్సింహారెడ్డి, మాణిక్రెడ్డి, సర్పంచ్లు సుకన్య, శ్రీనివాస్, వీరభద్రస్వామి, దీపాలత, కృష్ణారెడ్డి, పరమేశ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీశైలం, రాజు, మాణిక్యం, అంజిరెడ్డి, హరిశంకర్గౌడ్, తిరుపతిరెడ్డి, మల్లారెడ్డి, జగన్, డేవిడ్, నర్సింహులు, ఈశ్వర్ పాల్గొన్నారు.
నవాబుపేట, జూన్ 24: పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పరిశుభ్రంగా మారాయని, ప్రతినెలా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నాయని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. శుక్రవారం వారు మండలంలోని యెల్లకొండ, మాదిరెడ్డిపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఎమ్మెల్యే యాదయ్య, స్థాని క ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సబితారెడ్డి , ఎంపీ రంజిత్రెడ్డి యెల్లకొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు- మనబడి లో భాగంగా రూ.49 లక్షలతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి, అదేవిధంగా రూ.50 లక్షలతో యెల్లకొండ గ్రామం నుంచి పార్వతీపరమేశ్వరాలయం వరకు ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డు పనులకు శం కుస్థాపన చేశారు. అలాగే, మాదిరెడ్డిపల్లి గ్రా మంలో రూ.23 లక్షలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతోపాటు రూ.25 లక్షల తో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మె ల్యే యాదయ్య కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని పల్లెలు స్వచ్ఛంగా మారాయన్నారు. ‘మన ఊరు- మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానున్నదన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను అందులో చేర్పించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్గౌడ్, ఎంపీపీ భవాని, జడ్పీటీసీ జయమ్మ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు, యెల్లకొండ సర్పంచ్ వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిరెడ్డి, ఎంపీటీసీ విజయ్, మాదిరెడ్డిపల్లి సర్పంచ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రంగారెడ్డి, ఆనంద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.