వికారాబాద్ : అనంతపద్మనాభస్వామి జాతరకు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్తీక మాసం కావడంతో ఆలయ ఆవరణలో భక్తులు రావి చెట్టు కింద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు సహపంక్తి భోజనాలు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పోలీస్ సిబ్బంది తగు చర్యలు చేపట్టారు.
నందిఘాట్ వద్ద పర్యాటకులు అటవీ అందాలను తిలకించారు. ట్రెక్కింగ్ చేస్తూ పలువురు పర్యాటకులు సరదగా గడిపారు.