అబ్దుల్లాపూర్మెట్ : విజయవాడ జాతీయ రహదారి సమీపంలోని బాటసింగారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ను ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి శనివారం పరిశీలించారు. పండ్ల కోసం ఏర్పాటు చేసిన గోదాంలు, తదితర వివరాలను మార్కెట్ కార్యదర్శి పద్మహర్షను అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ 1నుంచి పండ్ల విక్రయాలు ప్రారంభమవుతాయన్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె వివరించారు.
ధర్మకాంట, గోదాములు, క్యాంటీన్, పెట్రోల్బంక్, పోలీస్ అవుట్పోస్ట్, తాగునీరు, మూత్రశాలలు ఏర్పాట్లు పూర్తి చేశామని, రైతులు, హమాలీలు, కమీషన్ ఏజెంట్లకు, వాహనాలు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిద్ధం చేశామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారులు, సీఐ స్వామి, ఎస్ఐ జానకిరాంరెడ్డి ఉన్నారు.