యాచారం : మూడు రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలకు మండలంలోని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వరిపంట నేలకొరిగిన వర్షం నీటిలో మునిగిపోయింది. వడ్లు నేలరాలాయి. కల్లాల వద్ద వర్షానికి వడ్లు తడిసిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న ముసురుకు పత్తి తడిసిపోయింది. చెట్లపైనే మొలకలొస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి ఆగమైపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన పంటలను సంబంధిత అధికారులు పరిశీలించి రైతులకు తగిన పరిహారం చెల్లించాలని రైతులు కోరతున్నారు.