షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని 2వ వార్డులో ఉత్తర భారతీయులు ఛఠ్ పూజా కార్యక్రమాన్ని గురువారం ఉదయం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగానే సూర్యభగవానుడికి వివిధ పండ్లు నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం కార్తిక మాసంలో ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షలతో ఈ ఛఠ్ పూజా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని భక్తులు తెలిపారు.
ఈ పూజా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకుడు చెట్ల నర్సింలు పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు రాధాకృష్ణ, నాయకులు భూపాల్రెడ్డి, విశ్వనాథం, రామకృష్ణయాదవ్, వినోద్శర్మ, అభిషేక్యాదవ్, విక్కి, ఆదర్శ్, శర్మ, సర్జ్సింగ్, వినోద్యాదవ్ పాల్గొన్నారు.
సూర్యభగవానుడికి పూజలు
కొత్తూరు రూరల్ : గురువారం తెల్లవారుజామున ఉత్తర భారతీయులు సూర్యభగవానుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వందల సంఖ్యలో వారి కుటుంబ సభ్యులతో కుంటలు, చెరువు గట్లు, కొలనుల వద్దకు చేరుకుని పండ్లు, ఫలాలు, కూరగాయలను నైవేద్యంగా సమర్పించి కీర్తనలు, పాటలతో హారతినిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. నాలుగు రోజులుగా ఎంతో నియమనిష్టలతో కఠిన ఉపవాస దీక్షలను ఆచరించి గురువారం తెల్లవారుజామున సూర్యభగవానుడిని దర్శించుకున్నాక వ్రతం ముగించారు. ఈ పూజా కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై భక్తులకు పండుగ శుభాకాంక్షలను తెలిపారు.