పరిగి టౌన్ : నిషేదిత గుట్కా ప్యాకేట్లు విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి గుట్కా ప్యాకేట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విఠల్రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. అంబెద్కర్ చౌరస్తాలోని ఓ వ్యక్తి పాన్షాపులో నిషేధిత గుట్కా ప్యాకేట్లు ఉన్నట్లు పక్కా సమాచారం రావడంతో షాపును తనిఖీ చేయగా గుట్కా ప్యాకేట్లు లభ్యమయ్యాయి. పాన్షాపుతో పాటు అతని ఇంట్లో కూడా తనిఖీ చేయగా అక్కడ కూడా దొరికాయన్నారు. వీటి విలువ రూ. 50వేల వరకు ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.