కొత్తూరు : హరిత మున్సిపాలిటీయే లక్ష్యంగా ముందుకు కదులుతున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పెంజర్ల రోడ్డు వద్ద ధరణి వెంచర్లో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యదేవేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని మంగళవారం ఎమ్మెల్యే అంజయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణను హరితమయంగా మార్చేందుకు ప్రతి గ్రామం, వార్డుల్లో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతి గ్రామానికి కావాల్సిన మొక్కలను నర్సరీల నుంచి తీసుకోవచ్చన్నారు. అంతే కాకుండా పరిశ్రమలు అధికంగా ఉన్న కొత్తూరులో కాలుష్యం అధికంగా ఉంటుందని చెప్పారు. ఈ కాలుష్యం నుంచి ప్రజలు బయటపడాలంటే ఇంటికో మొక్కను పెంచాలని పిలుపునిచ్చారు.
దీనివల్ల మున్సిపాలిటీ హరితమయంగా మారుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ డోలి రవీందర్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, కౌన్సిలర్ కొస్గి శ్రీను, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు భగవద్గీత, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్యాదవ్, జనార్దనచారి, బీసీ సెల్ అధ్యక్షుడు ఆంజనేయులు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగగళ్ల శివకుమార్ పాల్గొన్నారు.